+91 95819 05907

జగన్నాధపురం – గోకినపల్లి R&B రోడ్డు విస్తరణ కొరకు 25 కోట్ల నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి

జగన్నాధపురం నుండి గోకినపల్లి వరకు 19 కిలోమీటర్ల మేర విస్తరించిన R&B రహదారి అభివృద్ధిలో భాగంగా మత్కేపల్లి-జగన్నాధపురం R&B రోడ్డు నుండి మత్కేపల్లి గ్రామం మున్నేరు నది వరకు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌కు 25 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన గౌరవనీయులు *తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క కి* గ్రామస్తులు, రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు

ఈ రోడ్డు విస్తరణ ద్వారా గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడమే కాకుండా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఎంతో మేలు కలుగనుంది. గ్రామ ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులు ఈ అభివృద్ధి పనులకు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, “ఇంతకాలంగా ఎదుర్కొంటున్న రవాణా సమస్యలు ఈ రోడ్డు విస్తరణతో తీరనున్నాయి. భట్టి విక్రమార్క సహాయ సహకారాలు మాకు ఎనలేని మద్దతునందించాయి” అని తెలియజేశారు.

రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసిన సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేయాలని కోరుతూ, అభివృద్ధి పనులకు అండగా ఉంటామని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్… అక్రమ అరెస్టు పట్ల మండిపడ్డ ప్రతిపక్షాలు, సీనియర్ జర్నలిస్టులు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ రేవతిని సిసిఎస్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ రేవతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read More »

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

 Don't Miss this News !