+91 95819 05907

*ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి

..*

*జనగాం జిల్లా*
*(తేదీ 18.3.2025)*

*ఏఐటీయూసీ లో చేరిన ఎం.ఎల్. హెచ్.పి. ఉద్యోగులు..*

*ఎన్. హెచ్. ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా*

నేషనల్ హెల్త్ మిషన్ లో గత మూడు సంవత్సరాల నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలో ప్రజా నీకానికి వైద్య సేవలు అందిస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎం.ఎల్. హెచ్ .పి.)లకు రూ. 44 వేల వేతనం తోపాటు ఉద్యోగ భద్రతను కల్పించాలని నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు సి.హెచ్ రాజారెడ్డి పాల్గొని మాట్లాడారు.. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఉద్యోగులందరికీ సమాన పని సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
మంగళవారం రోజున మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ జనగాం జిల్లా స్థాయి సమావేశం గబ్బేట గోపాలరెడ్డి భవన్ లో జ్యోతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రామ రాజేష్ ఖన్నా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు అమలు చేయకుండా అతి తక్కువ జీతాలతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. డ్యూటీ చార్ట్ ప్రకారం విధులు చేయించకుండా అనేక రకాల క్రింది స్థాయి పనులను వారిపై రుద్దుతూ పని భారాన్ని పెంచటం అన్యాయమని ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బి.ఎస్సీ. నర్సింగ్, జనరల్ నర్సింగ్ , విద్యార్హతతో, డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నిక చేయబడినటువంటి ఎం. ఎల్ హెచ్. పి ఉద్యోగులకు కనీస వేతనం రూ.44 వేలు
ఇవ్వవలసి ఉండగా కేవలం 29 వేల 900 జీతం మాత్రమే చెల్లిస్తూ అధిక పనిభారాన్ని వారిపై మోపుతూ అన్ని స్థాయిలో పనులు వారితో చేయించుకోవడం అన్యాయమన్నారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ ఎఐటియూసి అండగా ఉండి పోరాటం నిర్వహిస్తుం దని తెలియజేశారు. ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న మాదిరి మన రాష్ట్రంలో కూడా ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న ఉద్యోగులకు 5 శాతం పర్ఫా ర్మెన్స్ బేసిడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశం అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కేతవత్ మహేష్ నాయక్ , ఉపాధ్యక్షులుగా పులి లావణ్య, ఉపాధ్యక్షులుగా బొల్లం జెస్సికా, ప్రధాన కార్యదర్శి కీర్తన మరియు ప్రవళిక సహాయ కార్యదర్శి గా ప్రశాంత్ కోశాధికారిగా శిరీష మమత ముఖ్య సలహాదారులుగా గంగరబోయిన జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.లిఖిత రాణి మరియు తదితరులను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జనగాం జిల్లా అధ్యక్షురాలు గంగరబోయిన జ్యోతి, ప్రధాన కార్యదర్శి ఏ.గణేష్ , ఎమ్.ఎల్.హెచ్.పి.లు మరియు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్‌!

రూ.3.30లక్షల కోట్లతో తెలంగాణ భారీ బడ్జెట్‌! 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3.30 లక్షల కోట్లతో బడ్జెట్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. ఓవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందన్న టాక్‌ వినిపిస్తోంది.

Read More »

నేటి నుండి ఘనంగా ప్రారంభం కానున్న గోవిందరాజు జాతర…పెద్ద ఎత్తున హాజరుకానున్న ★సనప★ వంశీయులు

*పెద్ద ఎత్తున హాజరుకానున్న సనప వంశీయులు* *నేటి గద్దర్ న్యూస్ గుండాల*, నేటి నుండి మూడు రోజులపాటు పెద్ద ఎత్తున గోవిందరాజు జాతర జరగనుంది. మండలం పరిధిలోని చెట్టుపల్లి గ్రామంలో సనప వారి ఇలవేల్పు

Read More »

కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి

భర్త అనుమానిస్తున్నాడని కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి విశాఖపట్నం పరిధి పెదగదిలి కొండవాలు ప్రాంతానికి చెందిన గొర్రె వెంకటరమణ, శిరీషలకు 2013లో పెళ్లైంది. ఐదు నెలల కిందట వీరికి ఒక పాప పుట్టింది

Read More »

నేడే తెలంగాణ బడ్జెట్….

*……. నేడే భట్టి బడ్జెట్ ……* నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…. ఉదయం 9.30 గంటలకు

Read More »

మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

వరంగల్ జిల్లా: వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా అరెస్టు వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్.. ఇన్ స్టాగ్రామ్

Read More »

కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించిన వాసవి క్లబ్

నేటి గద్దర్ న్యూస్, గుండాల:గుండాల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పథకాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు వాసవి క్లబ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి

Read More »

 Don't Miss this News !