నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఆదివాసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పెయింటింగ్ చిత్రాలతోపాటు గిరిజన వంటకాలకు సంబంధించిన స్టాల్స్ నిర్మాణం మరియు బాక్స్ క్రికెట్ గ్రౌండ్ పనులు శనివారం వరకు పూర్తి చేసి మ్యూజియమును విద్యుత్ కాంతులతో సర్వ సుందరంగా అలంకరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
బుధవారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఆయన సందర్శించి, బోటింగ్ ప్రదేశాలు బాక్స్ క్రికెట్ గ్రౌండ్, మ్యూజియం లోపల చిత్రీకరణ జరుగుతున్న పెయింటింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి దగ్గర పడుతున్నందున శ్రీసీతారాముని కళ్యాణ వేడుకలు తిలకించడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ట్రైబల్ మ్యూజియంను సందర్శించే విధంగా సన్నాహాలు చేస్తున్నందున, ఏ ఒక్క పని మిగలకుండా పూర్తిస్థాయిలో అన్ని పనులు పూర్తి కావాలని అన్నారు. ప్రస్తుతం చిన్నారుల బోటింగ్ సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని, బాక్స్ క్రికెట్ గ్రౌండ్ మరియు గిరిజనుల ఆచార వ్యవహారాలు వారి కట్టుబాట్లకు సంబంధించిన పెయింటింగ్ చిత్రాల పనులు శుక్రవారం లోగా పూర్తి కావాలని అన్నారు. సందర్శకులు సాంప్రదాయమైన గిరిజన వంటకాలు చవిచూడడానికి ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ రేపటిలోగా పూర్తి కావాలని, అలాగే ప్రస్తుతం మ్యూజియంలో ఉన్న వాష్ రూమ్ టాయిలెట్స్ ఏమైనా రిపేర్లు ఉంటే వెంటనే పనులు ప్రారంభించాలని ఈఈ ట్రైబల్ చంద్రశేఖర్ కు ఆదేశించారు. ఇంకా ఏమైనా గిరిజన కల్చర్ కు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలు ఖాళీగా ఉన్న ప్రదేశాలలో వేయించాలని, మ్యూజియం ప్రవేశద్వారం దగ్గర గిరిజన పల్లెల్లో ఉండే రచ్చబండ పెయింటింగ్ పూర్తిస్థాయి డిజైన్ గా వేయించాలని, స్వాగత ద్వారం పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశంలో పార్కింగ్ పనులు ప్రారంభించాలని అన్నారు.
అనంతరం గిరిజన కల్చర్ కు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలను ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఎ సి ఎం ఓ రమణయ్య, డి ఈ హరీష్, డీఎస్ఓ ప్రభాకర్ రావు, ఏ ఈ రవి, ఈవో జిపి శ్రీనివాస్, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.