+91 95819 05907

విద్యారంగానికి మేనిఫెస్టో లో ప్రకటించిన 15% నిధులు కేటాయించాలి నవాత్ సురేష్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 19:- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖకు గత ఏడాది కంటే 0.20% కేటాయింపులు తగ్గాయని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 15% ఇచ్చిన హామీకి బడ్జెట్లో కేటాయించిన దానికి పొంతనలేదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ తెలిపారు.బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందించారు.ప్రస్తుత బడ్జెట్లో కేవలం విద్యకు కేటాయించింది.రూ 23108 కోట్లు అని (7.57%).గత సంవత్సరం రూ 274058 కోట్ల బడ్జెట్ లో విద్యకు కేటాయించింది.రూ 21292 కోట్లు (7.77%) అంకెల్లో రూ 1816 కోట్లు పెరిగినట్లుగా ఉన్నప్పటికీ శాతాల్లో చూస్తే గత సంవత్సరం కంటే తగ్గిందన్నారు.విద్యాశాఖ పరిధిలో ఉన్న 26067 పాఠశాలలను గాలి కొదిలేసి,రెసిడెన్షియల్,యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతున్నదని.గురుకులాల్లో చదివేది 5.5 లక్షల మంది మాత్రమేనని,అదే ప్రభుత్వ, జిల్లాపరిషత్,మండల పరిషత్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 16 లక్షల మంది వరకు ఉండగా,వారిలో అత్యధికులు బడుగు బలహీన వర్గాల వారు మరియు బాలికలు ఉన్నారన్నారు.వీరికి నాణ్యమైన విద్య అందించడానికి ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవునని,విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, మెరుగైన మధ్యాహ్నభోజనం అందించేందుకు,నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా విద్యకు15% నిధులు కేటాయించాలని,అలాగే 1023 ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండగా 662 రెసిడెన్షియల్ స్కూల్ లకు సొంత భవనాలు లేవని, ఉన్నవాటికి కేటాయించకుండా కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం 11600 కోట్లు కేటాయించిందని,ఇక మిగిలింది ఏందని అయన ప్రశ్నించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర టూ తెలంగాణ అక్రమ ఇసుక రవాణా? చోద్యం చూస్తున్న అధికారులు!

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మర్రిగూడెం రహదారి నుంచి ఖమ్మం వెళ్లే రహదారి వైపు అక్రమ ఇసుక లారీ పోలీసులు పట్టుకున్న వైనం అర్ధరాత్రులు

Read More »

బానోత్ కిరణ్ కుమార్ పై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలపై చట్టరీత్యా చర్యలు :,మంత్రి పొంగులేటి

★బాధ్యులపై చట్టరీత్యా చర్యలు *ఖమ్మం రూరల్ / ఏదులాపురం మున్సిపాలిటీ: ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిరణ్ కుమార్ పై దాడి చేసిన

Read More »

అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు వితరణ

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, చింతకాని మండల పరిధిలో చిన్నమండవ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని వితరణ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్

Read More »

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది..? కర్నే

తీరని విద్యార్థుల దాహం..! నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి మణుగూరు : విద్యార్థుల నుంచి

Read More »

ఎస్సీ వర్గీకరణ అమలైనందున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మెదక్ పట్టణ జనరల్ సెక్రెటరీ గిద్దకింది ప్రవీణ్ కుమార్

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 19. మెదక్ జిల్లా కేంద్రంలో బుధవారం రోజున నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత

Read More »

బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా బ్రాహ్మణ అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ.

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 19:- బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని వారి బాగోగుల కోసం తన జీవితం అంకితం చేస్తానని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

Read More »

 Don't Miss this News !