+91 95819 05907

ఏకసభ్య కమిషన్ కాదది… ఏకపక్ష కమిషన్ :జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి

– మాలల అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు వర్గీకరణ కుట్ర…
– మాలలు ప్రత్యక్ష,న్యాయ పోరాటాలకు సిద్ధం కావాలి…
– జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి

కొత్తగూడెం, మార్చి 19,( ) : ఎస్సీ వర్గీకరణ చేయడానికి నియమించిన ఏకసభ్య కమిషన్, ఏకసభ్య కమిషన్ కాదని, ఏకపక్ష కమిషన్ అని,మాలల అస్తిత్వాన్ని దెబ్బతీయడానికే ప్రభుత్వం, ప్రతిపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు కుట్రపన్ని ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగానికి విరుద్ధంగా చేశాయని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత చేస్తూ ఆమోదించడాన్ని నిరసిస్తూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్ రావు నాయకత్వంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి సుమారు రెండు గంటల పాటు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్రావు,జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి మాట్లాడుతూ బిజెపి పాలిత రాష్ట్రాలలో చేయని ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో మంగళవారం అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తూ ఆమోదించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్సీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకొని 2011 కులగణన సర్వే ఆధారం కాకుండా 2024 వరకు కొత్తగా పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకొని ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్ గా మారిందని విమర్శించారు.వర్గీకరణ చేయడం,మాలల్ని అణిసివేయడమే లక్ష్యంగా పాలకులు, పార్టీలు ఒకటయ్యాయని, వర్గీకరణ చేయడంలో శాస్త్రీయత లేదని, శాస్త్రీయత ఉంటే కమిషన్ రిపోర్టును బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మనువాదాన్ని మళ్లీ తెరపైకి తేవడానికి వర్గీకరణ బిల్లు తెచ్చారని విమర్శించారు.ఎస్సీ వర్గీకరణ బిల్లుపై పోరాడడానికి మాలలు ప్రత్యక్ష, న్యాయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి, పాల్వంచ పట్టణ అధ్యక్షులు ధారా చిరంజీవి, జిల్లా మహిళా సంఘం కార్యదర్శి మద్దెటి జయ, నాయకులు జెట్టి మోహన్, కేడం రాము,సల్లం శంకర్, భయాని ఈశ్వరయ్య, పండుగ రాజేశ్వరరావు, పురుషోత్తం, గాదం రాజేందర్, జెట్టి శరత్, వెంకటరత్నం, భరద్వాజ్, టైసన్ శ్రీనివాస్, కనికంట శ్యామ్ కుమార్, గుర్రం లక్ష్మయ్య, బట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర టూ తెలంగాణ అక్రమ ఇసుక రవాణా? చోద్యం చూస్తున్న అధికారులు!

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మర్రిగూడెం రహదారి నుంచి ఖమ్మం వెళ్లే రహదారి వైపు అక్రమ ఇసుక లారీ పోలీసులు పట్టుకున్న వైనం అర్ధరాత్రులు

Read More »

బానోత్ కిరణ్ కుమార్ పై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలపై చట్టరీత్యా చర్యలు :,మంత్రి పొంగులేటి

★బాధ్యులపై చట్టరీత్యా చర్యలు *ఖమ్మం రూరల్ / ఏదులాపురం మున్సిపాలిటీ: ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిరణ్ కుమార్ పై దాడి చేసిన

Read More »

అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు వితరణ

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, చింతకాని మండల పరిధిలో చిన్నమండవ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని వితరణ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్

Read More »

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది..? కర్నే

తీరని విద్యార్థుల దాహం..! నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి మణుగూరు : విద్యార్థుల నుంచి

Read More »

ఎస్సీ వర్గీకరణ అమలైనందున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మెదక్ పట్టణ జనరల్ సెక్రెటరీ గిద్దకింది ప్రవీణ్ కుమార్

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 19. మెదక్ జిల్లా కేంద్రంలో బుధవారం రోజున నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత

Read More »

బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా బ్రాహ్మణ అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ.

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 19:- బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని వారి బాగోగుల కోసం తన జీవితం అంకితం చేస్తానని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

Read More »

 Don't Miss this News !