రోగులకు పండ్లు పంపిణీ.. కొత్త కౌన్సిలర్లకు ఘన సన్మానం: పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
నేటి గద్దర్ న్యూస్,అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక నాయకుడు కాసాని చంద్రమోహన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో నాయకులు కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సేవా దృక్పథంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా విజయం సాధించిన అభ్యర్థులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఓటమి చెందిన అభ్యర్థులు నిరాశ చెందవద్దని, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జుజ్జూరి వెంకన్న బాబు, టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, కాసాని చంద్రమోహన్ దంపతులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంక ప్రసాద్, యూఎస్ ప్రకాష్ రావు, రవి కిరణ్, వగ్గెల పూజ, మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, నారం రాజశేఖర్, మోటూరి మోహన్, బాలి కిరణ్, సోమని రమేష్, ఆరేపల్లి గోవింద్, చిక్కం మాధురి, గోపాలకృష్ణలతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, మహిళా కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని సందడి చేశారు.








