+91 95819 05907

నల్గొండ భారీ బహిరంగ సభ ను విజయవంతం చేద్దాం:కోలా రాజు

*కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..*

**పోరాడి సాధించిన తెలంగాణ లో కాంగ్రెస్ పాలనలో మళ్ళీ నీళ్ల పోరాటం*

*నల్గొండ భారీ బహిరంగ సభ ను విజయవంతం చేద్దాం*

*తెలంగాణ బలం. గళం.దళం బిఆర్ఎస్*

*తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కు ఎంతటి దాకా నైనా పోరాటం*

**రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి..తెల్ల కాగితం మీద అంకెలు రాసినట్టే ఉంది*

*భద్రాచలం గుడి అభివృద్ధి కి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి*

*సమావేశంలో బిఆర్ఎస్ మండల నాయకులు ఆకోజు సునిల్ కుమార్*

నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల నాయకులు కోలా రాజు అధ్యక్షతనసోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల నాయకులు *ఆకోజు సునిల్ కుమార్ మాట్లాడుతూ* కృష్ణా జలాల పరిరక్షణకై రేపు నల్లగొండలో జరిగే బహిరంగ సభ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు..
పోరాడి సాధించిన తెలంగాణలో కాంగ్రెస్ పాలన లో మళ్లీ నీళ్ల పోరాటం మొదలైందని కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటమేనని కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా కేంద్రానికి ఏ విధంగా కాంగ్రెస్ అప్పచెప్పుతుందని విమర్శించారు.. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో భద్రాచలం అభివృద్ధికి నిధులు కేటాయించలేదని పదేపదే విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉంటే మరి బడ్జెట్లో ఎందుకు భద్రాచలం అభివృద్ధి నిధులు కేటాయించలేదు వివరణ ఇవ్వాలని అన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేసే బాధ్యత నుండి తప్పుకునేందుకు కుయుక్తులు పన్నుతుందని తెలంగాణ రాష్ట్ర ఓటాన్ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా తెల్ల పేపర్ పై అంకెలు రాసిన చందంగా ఉందని అన్నారు..
ఈ సమావేశంలో కోటగిరి ప్రభోద్ కుమార్. గుంజ ఏడుకొండలు. బత్తుల నరసింహులు. లంకపల్లి విశ్వనాథ్. దన్నాన తరుణ్. చెన్నకేశవ. కొల్లిపాక శివ గుంజ బాబు. ప్రసాద్ .అయినాల రామకృష్ణ . అర్జున్ తదితరులు ఉన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !