+91 95819 05907

పేదలకు అండగా మీకోసం మేమున్నాం సహాయక సమితి

*రి. నెం:194/2022 కు పాన్ కార్డ్
*దాతల విరాళాలకు ఐటి మినహాయింపు
*నేటి వరకు 832 సేవా కార్యక్రమాలు 1లక్ష 38వేల లబ్ధిదారులకు రూ.75 లక్షల ఆర్ధిక వితరణ
*నేటి గదర్ న్యూస్ తో మీ కోసం మేము ఉన్నాము సహాయక సమితి ఫౌండర్ &చైర్మన్ లయన్ నీలి ప్రకాష్
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఆ మండలంలో రెక్కడి తే డొక్కాడని బతుకులు కొందరివి. అనారోగ్యం భారి న పడిన, ఉన్నత చదువులకు వెళ్లాలన్న, ప్రకృతి వైపరీత్యాలతో సకలం కోల్పోయి వీధిన పడ్డ అనేక నిరుపేద కుటుంబాలు… వారి దీనగాదును ఎవరికి చెప్పాలో అర్థం కాని దుస్థితి… అలాంటి నిరుపేద కుటుంబాలకు మేమున్నామంటూ చర్ల మండలంలో ధైర్యం కల్పిస్తు, దాతల సహకారాలతో లక్షల మందికి అండగా నిలుస్తున్న చర్ల మండల మీకోసం మేమున్నాం సహాయక సమితి పై నేటి గదర్ న్యూస్ ప్రత్యేక కథనం. చర్లకు చెందిన లయన్ నీలి ప్రకాష్ కష్టాల్లో ఉన్న బాధిత నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో మీకోసం మేమున్నాం సహాయక సమితిని ఏర్పాటు చేశారు. నీలి ప్రకాష్ ఆ సంస్థకి ఫౌండర్ గా చైర్మన్ గా ఉన్నారు. ఇప్పటివరకు దాతల విరాళాలతో సమకూర్చిన సుమారు రూ.75లక్షలను 1లక్ష38 వేల మంది బాధిత కుటుంబాలకుఅందజేశారు. ఈ సంస్థ అభాగ్యులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు సేవా దర్పన్, BSS సంస్థ ద్వారా సేవ రత్న జాతీయ పురస్కారాలతో ఆ సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ ను సన్మానించారు. దీనిని బట్టి చూస్తే మీకోసం మేమున్నాం సహాయక సమితి ఏజెన్సీ నిరుపేద గిరిజన గిరిజన ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. ఈ సంస్థ నీతి అయోగ్ లో రిజిస్టర్ అయి ఉంది. ఈ స్వచ్ఛంద సంస్థకు ఇటువంటి పాన్ కార్డు సైతం రావడం జరిగింది. సేవ గుణం ఉన్న వ్యాపారస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు , ఆదాయ పన్ను కట్టే వారందరికీ మీకోసం మేమున్నాం సహాయసమితికి విరాళం అందజేసిన యెడల ఆ వితరణ సొమ్ముకు పన్ను మినహాయింపు ఉంటుందని ఆ సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ తెలిపారు. దాతలు తమ సంస్థకు విరివిగా విరాళాలు ఇచ్చి నిరుపేద లకు అపన్నాహస్తం అందించాలనిఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !