మత్తులో జోగుతున్నారు
* అశ్లీలం గా ప్రవర్తిస్తున్నారు
* మత్తుబాబుల వెకిలి చేష్టలతో భయభ్రాంతులకు లోనవుతున్న జానంపేట ప్రజలు
* పోలీస్ లు గతంలో కౌన్సిలింగ్ ఇచ్చిన మారని చేష్టలు
* పోలీసులు వారి చేష్టలకు చెక్ పెట్టాలని వేడుకుంటున్న గ్రామస్తులు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(పినపాక): ఆ గ్రామంలో యువకులు మత్తులో జోగుతున్నారు. అది మధ్యమా లేక మరి ఇతర మత్తు పదార్థాలు సేవిస్తున్నారా తెలియాల్సింది. ఆ మత్తులో వారు పలు ఇళ్లలోకి చొరపడి ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారు.వారి వెకిలి చేష్టలకు సంబంధించిన విజువల్స్ నేటి గదర్ న్యూస్ సేకరించింది.బాధితులు, వీడియో విజువల్స్ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో ఓ రైతు ఇంట్లో వ్యక్తి చొరబడినట్లుగా సీసీ కెమెరా విజువల్స్ లో సోమవారం అర్ధరాత్రి రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో ఓ యువకుడు ఇంటి పరిసరాలను పరిశీలించాడు. ఎవరు గుర్తుపట్టని విధంగా మోకాని కి చేతులు అడ్డం పెట్టుకోవడమే కాకుండా టీ షర్ట్ ను సైతం మొఖం మీద కప్పుకోవడం జరిగింది. మత్తులో ఉన్న మైకంలో ఆ యువకుడు నీచాతి నీచంగా ప్రవర్తించాడు. మాటలు చెప్పడానికి వీలులేని విధంగా ప్రవర్తించడంతో అదృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఒక్క యువకుడి కాకుండా కొంతమంది యువకులు మత్తులో వికృత చేష్టలకు పాల్పడుతున్నారని గ్రామ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులకు గతంలో ఏడూళ్ళ బయ్యారం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు లేదు. ఇళ్లలో ఎవరు లేని సమయాన సీసీ కెమెరాలు ముందుకు వచ్చి వికృత చేష్టలకు పాల్పడడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ అధికారులు దృష్టి సారించి సైకో లకు తగిన బుద్ధి చెప్పాలని గ్రామస్థులు కోరుతున్నారు.
