+91 95819 05907

ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూస్తున్న గిరిజనేతరుల పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.

*ఆదివాసీలను ఆధారాలు అడిగితే చట్ట రీత్యా నేరం
*ఏ ఎన్ ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కోర్స నర్సింహమూర్తి
నేటి గదర్ న్యూస్ ,వాజేడు(వెంకటాపురం):ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూస్తున్న గిరిజనేతరుల పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏ ఎన్ ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కోర్స నర్సింహమూర్తి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన వెంకటాపురం మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏజెన్సీ లో 1/70 చట్టాన్ని యదేచ్చగా ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాయకుల గూడెం గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో గిరిజనులు, ఆదివాసీలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని,వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని యూడిసి ఎంజ సమ్మయ్యకు నర్సింహ మూర్తి ఆదివాసీల తో కలిసి సోమవారం మెమొరాండం ఇచ్చారు. 5వ షెడ్యూల్డ్ భూభాగం లో ప్రతి సెంట్ ప్రభుత్వ భూమి ఆదివాసీలకు చెందుతుందని 1/70 చట్టం చెప్తోందనీ రెవెన్యూ అధికారికి తెలియజేశారు.భూమికి సంబంధించిన కాగితాలు చూపె ట్టాలనీ ఆదివాసీలను అధికారులు అడిగి బెదిరింపు చర్యలకు పాల్పడటం నేరం అవుతుందని అన్నారు. గిరిజ నేతరులను మాత్రమే ఆధారాలు అడగాలని చట్టం చెప్తున్నట్లు ఆయన రెవెన్యూ అధికారులకు సూచించారు. ఎన్నో ఏళ్లుగా నాయకుల గూడెం గిరిజనులు ఇంటి స్థలాలు లేక ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి అన్నారు. వారికి ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని మెమొరాండం లో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ నేటికీ ప్రభుత్వ భూములను గిరిజనేతరులు కబ్జా చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు అని విమర్శలు గుప్పించారు . సంబంధం లేని గిరిజనేతరులు తమ భూమి అని నివాసాలు ఖాళీ చేయాలని బెదిరింపు చర్యలకు పాల్పడటం పైన ఆయన మండిపడ్డారు. రెవెన్యూ రికార్డ్ ల ప్రకారం వెంకటాపురం జీ సర్వే నంబర్54,55, 56 లోని భూమి ప్రభుత్వ భూమి గా ఉన్నదని అన్నారు. కానీ కొంతమంది అక్రమార్కులు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది అని అన్నారు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అండగా నిలబడితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నాయకుల గూడెం ఆదివాసీల పక్షాన ఏ ఒక్క రాజకీయ పార్టీ నిలడక పోయిన ఆదివాసీ నవనిర్మాణ సేన ఖచ్చితంగా అండగా నిలబడుతుంది అన్నారు. సర్వే నంబర్ 54,55, 56 లోని ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయకుండ చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉన్నదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి కుంజ మహేష్, ఉమ్మడి యేసు, రాంబాబు ఆదివాసీలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !