+91 95819 05907

ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూస్తున్న గిరిజనేతరుల పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.

*ఆదివాసీలను ఆధారాలు అడిగితే చట్ట రీత్యా నేరం
*ఏ ఎన్ ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కోర్స నర్సింహమూర్తి
నేటి గదర్ న్యూస్ ,వాజేడు(వెంకటాపురం):ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూస్తున్న గిరిజనేతరుల పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏ ఎన్ ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కోర్స నర్సింహమూర్తి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన వెంకటాపురం మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏజెన్సీ లో 1/70 చట్టాన్ని యదేచ్చగా ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాయకుల గూడెం గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో గిరిజనులు, ఆదివాసీలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని,వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని యూడిసి ఎంజ సమ్మయ్యకు నర్సింహ మూర్తి ఆదివాసీల తో కలిసి సోమవారం మెమొరాండం ఇచ్చారు. 5వ షెడ్యూల్డ్ భూభాగం లో ప్రతి సెంట్ ప్రభుత్వ భూమి ఆదివాసీలకు చెందుతుందని 1/70 చట్టం చెప్తోందనీ రెవెన్యూ అధికారికి తెలియజేశారు.భూమికి సంబంధించిన కాగితాలు చూపె ట్టాలనీ ఆదివాసీలను అధికారులు అడిగి బెదిరింపు చర్యలకు పాల్పడటం నేరం అవుతుందని అన్నారు. గిరిజ నేతరులను మాత్రమే ఆధారాలు అడగాలని చట్టం చెప్తున్నట్లు ఆయన రెవెన్యూ అధికారులకు సూచించారు. ఎన్నో ఏళ్లుగా నాయకుల గూడెం గిరిజనులు ఇంటి స్థలాలు లేక ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి అన్నారు. వారికి ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని మెమొరాండం లో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ నేటికీ ప్రభుత్వ భూములను గిరిజనేతరులు కబ్జా చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు అని విమర్శలు గుప్పించారు . సంబంధం లేని గిరిజనేతరులు తమ భూమి అని నివాసాలు ఖాళీ చేయాలని బెదిరింపు చర్యలకు పాల్పడటం పైన ఆయన మండిపడ్డారు. రెవెన్యూ రికార్డ్ ల ప్రకారం వెంకటాపురం జీ సర్వే నంబర్54,55, 56 లోని భూమి ప్రభుత్వ భూమి గా ఉన్నదని అన్నారు. కానీ కొంతమంది అక్రమార్కులు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది అని అన్నారు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అండగా నిలబడితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నాయకుల గూడెం ఆదివాసీల పక్షాన ఏ ఒక్క రాజకీయ పార్టీ నిలడక పోయిన ఆదివాసీ నవనిర్మాణ సేన ఖచ్చితంగా అండగా నిలబడుతుంది అన్నారు. సర్వే నంబర్ 54,55, 56 లోని ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయకుండ చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉన్నదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి కుంజ మహేష్, ఉమ్మడి యేసు, రాంబాబు ఆదివాసీలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !