+91 95819 05907

మావోయిస్టు పార్టీ నిర్ములనే ధ్యేయంగా కేంద్రం ఫోకస్

*మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా గడ్డపై అడుగు పెట్టిన పోలీసులు
*కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన రెండవ రోజే కాకులు దూరని కారడవి హిడ్మా గ్రామంలో జాతీయ జెండా ఎగురవేసిన పోలీసులు
* చత్తీస్గడ్ లో ఇప్పటికే మావోయిస్టు ల సొరంగ స్థావరాలు కనిపెట్టిన పోలీసు బలగాలు
*మావోయిస్టుల వ్యవసాయ భూముల స్వాధీనం
*చత్తీస్గడ్,ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీ
* మావోయిస్టులు సీనియర్లను కోల్పోయి, కొత్త రిక్రూట్ రిక్రూట్మెంట్ లేక ఢీలా పడుతున్నారా?!
* ఇరు వర్గాల మధ్య నలుగుతున్న ఆదివాసీలు
* అలజడలకు ఆస్కారం!?
* దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధం
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:మావోయిస్టు పార్టీ నిర్ములనే ధ్యేయంగా కేంద్రం ఫోకస్ పెట్టింది. చత్తీస్గడ్ రాష్ట్రంలో కాకులు దూరని కారడవి లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హెడ్మా గ్రామంలో సి ఆర్ పి ఎఫ్ బెటాలియన్లు ,పోలీసులు అడుగుపెట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి భారత దేశంలో తీవ్రవాదులు, మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించిన రెండు రోజుల అనంతరం పోలీస్ బలగాలు మావోయిస్టు హిడ్మా గ్రామంలో సిఆర్పిఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేసి జాతీయ జెండాను ఎగరవేయడం దీనికి మరింత బలం చేకూరింది. సిఆర్పిఎఫ్ జవాన్లను మావోయిస్టులు బాంబు అమర్చి హతమార్చిన అనంతరం కేంద్రం మరింత సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే చతిస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై అత్యున్నత పరిజ్ఞానం వినియోగించుకుని సమాచారం సేకరించారు. ఒకవైపు మావోయిస్టు సానుభూతి పరులను గుర్తిస్తూ వారిని లొంగిపోయే విధంగా చర్యలు చేపట్టారు. అలాగే మావోయిస్టు కీలక స్థావరాలను, సొరంగ మార్గాలను సిఆర్పిఎఫ్, ఆ రాష్ట్ర పోలీసులు కనుగొన్నారు. ఈ అంశాలు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా మారాయి. పోలీస్ బలగాలు మావోయిస్టు పార్టీ ఆర్థిక వనరులను సైతం దెబ్బతీస్తున్నారు. ఇప్పటికే చతిస్గడ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మావోయిస్టులు సాగు చేస్తున్న వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకున్నారు. పలువురు మావోయిస్టు కొరియర్లు చందాలు వసూలు చేసుకుని వారికి చేర్చే క్రమంలో పట్టుబడుతున్నారు. ఈ అంశాలన్నీ మావోయిస్టు పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారి. కరోనా కాలంలో మావోయిస్టు పార్టీ అతి ముఖ్య నేతలను ,చురుకైన వారిని కోల్పోయింది. దీనితో వారికి పెద్ద దెబ్బ పడింది. కొత్త రిక్రూట్మెంట్లు పెద్ద మొత్తంలో లేకపోవడం, కేంద్రం నిర్బంధం ఎక్కువ అవ్వడంతో మావోయిస్టు పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని పలువురి వాదన. ఇది ఇలా ఉండగా దట్టమైన అడవిలోకి సిఆర్పిఎఫ్, మావోయిస్టు నిరోధక బలగాలు, పోలీసులు అడుగుపెట్టడంతో ఆ ప్రాంతాలలో యుద్ధ మేఘాలు అలమకున్నాయి. దీనితో గిరి బిడ్డలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితులలో ఇరువర్గాల ఘర్షణల మూలంగా అలజడలు తలెత్తే ఆస్కారం మెండుగా ఉంది. అధునాతన పరిజ్ఞానం వినియోగిస్తూ పోలీస్ శాఖ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !