+91 95819 05907

మావోయిస్టు పార్టీ నిర్ములనే ధ్యేయంగా కేంద్రం ఫోకస్

*మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా గడ్డపై అడుగు పెట్టిన పోలీసులు
*కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన రెండవ రోజే కాకులు దూరని కారడవి హిడ్మా గ్రామంలో జాతీయ జెండా ఎగురవేసిన పోలీసులు
* చత్తీస్గడ్ లో ఇప్పటికే మావోయిస్టు ల సొరంగ స్థావరాలు కనిపెట్టిన పోలీసు బలగాలు
*మావోయిస్టుల వ్యవసాయ భూముల స్వాధీనం
*చత్తీస్గడ్,ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీ
* మావోయిస్టులు సీనియర్లను కోల్పోయి, కొత్త రిక్రూట్ రిక్రూట్మెంట్ లేక ఢీలా పడుతున్నారా?!
* ఇరు వర్గాల మధ్య నలుగుతున్న ఆదివాసీలు
* అలజడలకు ఆస్కారం!?
* దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధం
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:మావోయిస్టు పార్టీ నిర్ములనే ధ్యేయంగా కేంద్రం ఫోకస్ పెట్టింది. చత్తీస్గడ్ రాష్ట్రంలో కాకులు దూరని కారడవి లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హెడ్మా గ్రామంలో సి ఆర్ పి ఎఫ్ బెటాలియన్లు ,పోలీసులు అడుగుపెట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి భారత దేశంలో తీవ్రవాదులు, మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించిన రెండు రోజుల అనంతరం పోలీస్ బలగాలు మావోయిస్టు హిడ్మా గ్రామంలో సిఆర్పిఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేసి జాతీయ జెండాను ఎగరవేయడం దీనికి మరింత బలం చేకూరింది. సిఆర్పిఎఫ్ జవాన్లను మావోయిస్టులు బాంబు అమర్చి హతమార్చిన అనంతరం కేంద్రం మరింత సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే చతిస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై అత్యున్నత పరిజ్ఞానం వినియోగించుకుని సమాచారం సేకరించారు. ఒకవైపు మావోయిస్టు సానుభూతి పరులను గుర్తిస్తూ వారిని లొంగిపోయే విధంగా చర్యలు చేపట్టారు. అలాగే మావోయిస్టు కీలక స్థావరాలను, సొరంగ మార్గాలను సిఆర్పిఎఫ్, ఆ రాష్ట్ర పోలీసులు కనుగొన్నారు. ఈ అంశాలు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా మారాయి. పోలీస్ బలగాలు మావోయిస్టు పార్టీ ఆర్థిక వనరులను సైతం దెబ్బతీస్తున్నారు. ఇప్పటికే చతిస్గడ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మావోయిస్టులు సాగు చేస్తున్న వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకున్నారు. పలువురు మావోయిస్టు కొరియర్లు చందాలు వసూలు చేసుకుని వారికి చేర్చే క్రమంలో పట్టుబడుతున్నారు. ఈ అంశాలన్నీ మావోయిస్టు పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారి. కరోనా కాలంలో మావోయిస్టు పార్టీ అతి ముఖ్య నేతలను ,చురుకైన వారిని కోల్పోయింది. దీనితో వారికి పెద్ద దెబ్బ పడింది. కొత్త రిక్రూట్మెంట్లు పెద్ద మొత్తంలో లేకపోవడం, కేంద్రం నిర్బంధం ఎక్కువ అవ్వడంతో మావోయిస్టు పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని పలువురి వాదన. ఇది ఇలా ఉండగా దట్టమైన అడవిలోకి సిఆర్పిఎఫ్, మావోయిస్టు నిరోధక బలగాలు, పోలీసులు అడుగుపెట్టడంతో ఆ ప్రాంతాలలో యుద్ధ మేఘాలు అలమకున్నాయి. దీనితో గిరి బిడ్డలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితులలో ఇరువర్గాల ఘర్షణల మూలంగా అలజడలు తలెత్తే ఆస్కారం మెండుగా ఉంది. అధునాతన పరిజ్ఞానం వినియోగిస్తూ పోలీస్ శాఖ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

 Don't Miss this News !