+91 95819 05907

అక్రమంగా వ్యాపారాలకు డొమెస్టిక్ సిలిండర్ వినియోగించే వారికి సివిల్ సప్లై హెచ్చరికలు?!

ఇంటి గ్యాస్ (డొమెస్టిక్ )సిలిండర్ల పై సివిల్ సప్లై నజర్
*రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లు
*రోజుకు 2 లక్షల సిలిండర్ల వినియోగం
* రూ.500 గ్యాస్ పథకం కొరకురాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,500కోట్ల పై చిలుకు భారం
*రాష్ట్రంలో అక్రమంగా
కమర్షియల్ గా వినియోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను మెరుపు దాడులు చేసిస్వాధీనం చేసుకుంటున్న సివిల్ సప్లై అధికారులు
*కేసులు నమోదు చేస్తున్నా ఆ శాఖ
*ఉచిత గ్యాస్ కొరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వివరాలు సేకరిస్తున్న గ్యాస్ ఏజెన్సీలు
* హోటల్లు, రెస్టారెంట్లు, గ్యాస్ వినియోగించే వ్యాపారాలపై పెరగనున్న దాడులు
* ముందుగానే హెచ్చరిస్తున్న నేటి గదర్ న్యూస్

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి: మీకు హోటల్ ఉందా… కర్రీ పాయింట్, నూడిల్స్ పాయింట్,రెస్టారెంట్ ఇలా వ్యాపారులు నిర్వహిస్తున్నారా!జాగ్రత్త సుమీ. అక్రమంగా వ్యాపారాలకు డొమెస్టిక్ సిలిండర్ వినియోగించే వారి పై సివిల్ సప్లై దాడులు జరగనున్నట్లు విశ్వసినీయ సమాచారం . ఇందుకు కారణం ఇదే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గృహలక్ష్మి పథకం కింద రూ. 500 కి గ్యాస్ సిలిండర్ అర్హులైన మహిళలకి అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ మేరకు ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీ ల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రూ.10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ పథకాలు అమలు చేశారు.3వ హామి కింద రూ.500 అర్హులైన మహిళలకు గ్యాస్ అందజేయనున్నారు.ఇప్పటికే గ్యాస్ లబ్ధిదారుల వివరాలు సేకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయితీలలో సంబంధిత అధికారులు సైతం లబ్ధిదారుల వివరాలపై ఎంక్వయిరీ చేయడం జరిగింది. ఈ పథకం అమలు చెయ్యాలి అంటే రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపుగా రూ.2500 కోట్ల భారం ప్రతి సంవత్సరం పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఈ పథకం పారదర్శకంగా అమలు కావాలంటే డొమెస్టిక్ గ్యాస్ దుబారాను నియంత్రించాలని ప్రభుత్వం ఆలోచన. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది చిరు వ్యాపారులు, హోటల్లు ,రెస్టారెంట్లు తదితర వాణిజ్య కార్యకలాపాలకు దొడ్డదారిలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగించిన సివిల్ సప్లై అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించేవారు. రూ.500 కి డొమెస్టిక్ గ్యాస్ ప్రభుత్వం రాయితీపై అందజేయాలి అంటే అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందే. లేనియెడల ప్రభుత్వంపై అధిక భారం పడే ఆస్కారం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలలో సివిల్ సప్లై అధికారులు హోటల్స్ రెస్టారెంట్లపై దాడులు నిర్వహిస్తూ అక్రమంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు… కేసులు సైతం నమోదు చేస్తున్నారు. రాబోయే రోజులలో ఆయా వ్యాపారస్తులపై సివిల్ సప్లై అధికారులు మరిన్ని దాడులు చేసే ఆస్కార ఉంది. జాగ్రత్త సుమీ. ఆయా వ్యాపారస్తులకు నేటి గదర్ హెచ్చరిక,సూచన.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !