+91 95819 05907

అక్రమంగా వ్యాపారాలకు డొమెస్టిక్ సిలిండర్ వినియోగించే వారికి సివిల్ సప్లై హెచ్చరికలు?!

ఇంటి గ్యాస్ (డొమెస్టిక్ )సిలిండర్ల పై సివిల్ సప్లై నజర్
*రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లు
*రోజుకు 2 లక్షల సిలిండర్ల వినియోగం
* రూ.500 గ్యాస్ పథకం కొరకురాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,500కోట్ల పై చిలుకు భారం
*రాష్ట్రంలో అక్రమంగా
కమర్షియల్ గా వినియోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను మెరుపు దాడులు చేసిస్వాధీనం చేసుకుంటున్న సివిల్ సప్లై అధికారులు
*కేసులు నమోదు చేస్తున్నా ఆ శాఖ
*ఉచిత గ్యాస్ కొరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వివరాలు సేకరిస్తున్న గ్యాస్ ఏజెన్సీలు
* హోటల్లు, రెస్టారెంట్లు, గ్యాస్ వినియోగించే వ్యాపారాలపై పెరగనున్న దాడులు
* ముందుగానే హెచ్చరిస్తున్న నేటి గదర్ న్యూస్

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి: మీకు హోటల్ ఉందా… కర్రీ పాయింట్, నూడిల్స్ పాయింట్,రెస్టారెంట్ ఇలా వ్యాపారులు నిర్వహిస్తున్నారా!జాగ్రత్త సుమీ. అక్రమంగా వ్యాపారాలకు డొమెస్టిక్ సిలిండర్ వినియోగించే వారి పై సివిల్ సప్లై దాడులు జరగనున్నట్లు విశ్వసినీయ సమాచారం . ఇందుకు కారణం ఇదే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గృహలక్ష్మి పథకం కింద రూ. 500 కి గ్యాస్ సిలిండర్ అర్హులైన మహిళలకి అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ మేరకు ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీ ల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రూ.10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ పథకాలు అమలు చేశారు.3వ హామి కింద రూ.500 అర్హులైన మహిళలకు గ్యాస్ అందజేయనున్నారు.ఇప్పటికే గ్యాస్ లబ్ధిదారుల వివరాలు సేకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయితీలలో సంబంధిత అధికారులు సైతం లబ్ధిదారుల వివరాలపై ఎంక్వయిరీ చేయడం జరిగింది. ఈ పథకం అమలు చెయ్యాలి అంటే రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపుగా రూ.2500 కోట్ల భారం ప్రతి సంవత్సరం పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఈ పథకం పారదర్శకంగా అమలు కావాలంటే డొమెస్టిక్ గ్యాస్ దుబారాను నియంత్రించాలని ప్రభుత్వం ఆలోచన. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది చిరు వ్యాపారులు, హోటల్లు ,రెస్టారెంట్లు తదితర వాణిజ్య కార్యకలాపాలకు దొడ్డదారిలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగించిన సివిల్ సప్లై అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించేవారు. రూ.500 కి డొమెస్టిక్ గ్యాస్ ప్రభుత్వం రాయితీపై అందజేయాలి అంటే అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందే. లేనియెడల ప్రభుత్వంపై అధిక భారం పడే ఆస్కారం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలలో సివిల్ సప్లై అధికారులు హోటల్స్ రెస్టారెంట్లపై దాడులు నిర్వహిస్తూ అక్రమంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు… కేసులు సైతం నమోదు చేస్తున్నారు. రాబోయే రోజులలో ఆయా వ్యాపారస్తులపై సివిల్ సప్లై అధికారులు మరిన్ని దాడులు చేసే ఆస్కార ఉంది. జాగ్రత్త సుమీ. ఆయా వ్యాపారస్తులకు నేటి గదర్ హెచ్చరిక,సూచన.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !