+91 95819 05907

అక్రమంగా వ్యాపారాలకు డొమెస్టిక్ సిలిండర్ వినియోగించే వారికి సివిల్ సప్లై హెచ్చరికలు?!

ఇంటి గ్యాస్ (డొమెస్టిక్ )సిలిండర్ల పై సివిల్ సప్లై నజర్
*రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లు
*రోజుకు 2 లక్షల సిలిండర్ల వినియోగం
* రూ.500 గ్యాస్ పథకం కొరకురాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,500కోట్ల పై చిలుకు భారం
*రాష్ట్రంలో అక్రమంగా
కమర్షియల్ గా వినియోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను మెరుపు దాడులు చేసిస్వాధీనం చేసుకుంటున్న సివిల్ సప్లై అధికారులు
*కేసులు నమోదు చేస్తున్నా ఆ శాఖ
*ఉచిత గ్యాస్ కొరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వివరాలు సేకరిస్తున్న గ్యాస్ ఏజెన్సీలు
* హోటల్లు, రెస్టారెంట్లు, గ్యాస్ వినియోగించే వ్యాపారాలపై పెరగనున్న దాడులు
* ముందుగానే హెచ్చరిస్తున్న నేటి గదర్ న్యూస్

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి: మీకు హోటల్ ఉందా… కర్రీ పాయింట్, నూడిల్స్ పాయింట్,రెస్టారెంట్ ఇలా వ్యాపారులు నిర్వహిస్తున్నారా!జాగ్రత్త సుమీ. అక్రమంగా వ్యాపారాలకు డొమెస్టిక్ సిలిండర్ వినియోగించే వారి పై సివిల్ సప్లై దాడులు జరగనున్నట్లు విశ్వసినీయ సమాచారం . ఇందుకు కారణం ఇదే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గృహలక్ష్మి పథకం కింద రూ. 500 కి గ్యాస్ సిలిండర్ అర్హులైన మహిళలకి అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ మేరకు ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీ ల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రూ.10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ పథకాలు అమలు చేశారు.3వ హామి కింద రూ.500 అర్హులైన మహిళలకు గ్యాస్ అందజేయనున్నారు.ఇప్పటికే గ్యాస్ లబ్ధిదారుల వివరాలు సేకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయితీలలో సంబంధిత అధికారులు సైతం లబ్ధిదారుల వివరాలపై ఎంక్వయిరీ చేయడం జరిగింది. ఈ పథకం అమలు చెయ్యాలి అంటే రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపుగా రూ.2500 కోట్ల భారం ప్రతి సంవత్సరం పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఈ పథకం పారదర్శకంగా అమలు కావాలంటే డొమెస్టిక్ గ్యాస్ దుబారాను నియంత్రించాలని ప్రభుత్వం ఆలోచన. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది చిరు వ్యాపారులు, హోటల్లు ,రెస్టారెంట్లు తదితర వాణిజ్య కార్యకలాపాలకు దొడ్డదారిలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగించిన సివిల్ సప్లై అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించేవారు. రూ.500 కి డొమెస్టిక్ గ్యాస్ ప్రభుత్వం రాయితీపై అందజేయాలి అంటే అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందే. లేనియెడల ప్రభుత్వంపై అధిక భారం పడే ఆస్కారం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలలో సివిల్ సప్లై అధికారులు హోటల్స్ రెస్టారెంట్లపై దాడులు నిర్వహిస్తూ అక్రమంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు… కేసులు సైతం నమోదు చేస్తున్నారు. రాబోయే రోజులలో ఆయా వ్యాపారస్తులపై సివిల్ సప్లై అధికారులు మరిన్ని దాడులు చేసే ఆస్కార ఉంది. జాగ్రత్త సుమీ. ఆయా వ్యాపారస్తులకు నేటి గదర్ హెచ్చరిక,సూచన.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !