+91 95819 05907

సమ్మక్క తల్లి స్పూర్తితో 10 సంవత్సరాల దోపిడీ పై కొట్లాడి అధికారంలోకి వచ్చినం;సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క తల్లి స్పూర్తితో 10 సంవత్సరాల దోపిడీ పై కొట్లాడినం;సీఎం రేవంత్ రెడ్డి
* సమ్మక్క సారలమ్మ జాతరకు రూ 110 కోట్లు కేటాయించినం
* ఆధిపత్యం చేలాయిస్తే ఎవరో ఒకరు పుడతారు
* పేదల ప్రభుత్వం ఏర్పడింది
* ప్రజా పాలన ద్వారా ప్రజలకు చేరువవుతాం
* ప్రజలకు ఏం కావాలో అదే మా ఎజెండా
* సమ్మక్క జాతరకు 6000 బస్సులు కేటాయించాం
*18 కోట్ల మంది ఆడపడుచులు ఉచితబస్సును సద్వినియోగం చేసుకున్నారు
నేటి గదర్ న్యూస్,ములుగు ప్రతినిధి: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల స్ఫూర్తితో 10 సంవత్సరాల అరాచక పాలన పై పోరాటం చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్ చేశారు. ఆయనమేడారం లో సమ్మక్క సారలమ్మ అమ్మ వార్లను శుక్రవారంమంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు గత పది సంవత్సరాలుగా అంచివేతకు గురయ్యారాన్ని, అలాంటి సందర్భంలో ఎవరో ఒకరు పుడతారని గత పాలన ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్ష కామెంట్ చేశారు.సమ్మక్క సారలమ్మ జాతరకు రూ 110 కోట్లు కేటాయించినం. మేడారం జాతరకు ప్రభుత్వం 6000 బస్సుల ద్వారా ప్రయాణికులను చేరవేయడం జరిగిందన్నారు. అలాగే అదనంగా మరో 100 బస్సులు కేటాయించడం జరిగిందని సీఎం తెలిపారు. సమ్మక్క తల్లి స్ఫూర్తితో ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆధిపత్యం చేలాయిస్తే ఎవరో ఒకరు పుడతారు.పేదల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజా పాలన ద్వారా ప్రజలకు చేరువవుతాం.ప్రజలకు ఏం కావాలో అదే మా ఎజెండా. తెలంగాణ రాష్ట్రంలో 18 కోట్ల మంది ఆడపడుచులు ఉచిత బస్సు సర్వీసు సద్వినియోగం చేసుకున్నారని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తాం అని అన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు వివిధ శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !