+91 95819 05907

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా…ఎందుకంటే…

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాగా వెయ్యాలని భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావుకు మరొకసారి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.కాగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి అనేకమంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని,రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇద్దరు ఖమ్మం ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి రేపటినుండి పర్యటన లు ప్రారంభించనున్నారు. దీనితో ఆయన పర్యటనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ప్రసాద రెడ్డికి ఇచ్చిందా? అనే అనుమానాలకు తావిస్తుంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాలేరు,మధిర,వైరా, సత్తుపల్లి,కొత్తగూడెం, అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక మధిర మినహాయిస్తే మిగతా నియోజకవర్గాలలో మంత్రి పొంగిలేటి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ పొందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ కారణం చేత ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు మంత్రి పొంగిలేటికి మద్దతు పలికే ఆస్కారం ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి ప్రసాద్ రెడ్డి నా అని చర్చ జరుగుతుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 6

Read More »

భూదాన్ నిర్వాసితులను ఇండ్లలోకి పంపే వరకు పోరాటం చేస్తాం*

తుమ్మల , శ్రీనివాస్ రెడ్డి , భట్టి పేదల పక్షమే అంటే మా పోరాటం లో భాగస్వామ్యం కావాలి.* *బీసీ , ఎస్సీ , ఎస్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ విషాదారన్ మహరాజ్* నేటి

Read More »

 Don't Miss this News !