+91 95819 05907

KTDM: మార్చి 1న జరిగే సేవాలాల్‌ జయంతి వేడుకలకు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక అలా

🔸 జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రచార కరపత్రాల ఆవిష్కరణ

నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి : మార్చి 1న లక్ష్మిదేవిపల్లి మండలం లాలూతండా గ్రామ పంచాయతీ, బోరింగ్‌ తండా హనుమాన్‌ గుడి ఆవరణలో కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి సదుర్గరు శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్‌ డా. ప్రియాంక అలాచేతుల మీదుగా జయంతి వేడుకల ప్రచార కరపత్రాలను ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా కమిటి కన్వీనర్‌, తెలంగాణ గిరిజన నమాఖ్య, భద్రాది జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్‌ మాట్లాడుతూ…ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ,సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ,
జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆయన తెలిపారు .బంజార సమాజాన్ని సంఘటిత పర్చడానికి, స్వాభిమానంతో జీవింపచేయడానికి సేవాలాల్‌ ఎనలేని కృషి చేశాడని, సమాజహితమం కోసం దేశమంతా పర్యటించి బంజారా సమాజంతోపాటు పేద వర్గాలను జాగృతం చేశాడన్నారు. బంజారాలు చెడు మార్గంలో వెల్లకుండా ఉన్నతమైన జీవితం గడిపేలో కృషి చేసిన సేవాలాల్‌ సెవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించడానికి శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి ఉత్సవాలను మార్చి 1న బోరింగ్‌తండా గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కన్వీనింగ్‌ కమిటి సభ్యులు నూనావత్‌ గోవింద్‌, జర్పుల ఉపేందర్‌, జి.నగేష్స్‌ సంపత్‌కుమార్‌, రవి.ప్రసాద్‌, బాలకృష్ణ, రాములు, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

 Don't Miss this News !