+91 95819 05907

PINAPAKA:సమస్యలు పరిష్కరించాలని పోస్ట్ మెట్రిక్ హాస్టల్(PMH) ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరవధిక సమ్మె

సమస్యలు పరిష్కరించాలని పోస్ట్ మెట్రిక్ హాస్టల్(PMH) ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరవధిక సమ్మె
*ప్రధాన డిమాండ్లు*
*18 నెలల వేతనాలు చెల్లించాలి
*క్యాటరింగ్ విధానం రద్దు చెయ్యాలి
*జీ ఓ నెం.60 ప్రకారం రూ.15,600 చెల్లించాలి
*ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలి
నేటి గదర్ న్యూస్,పినపాక: గత 18 నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ తో పినపాక మండలం పినపాక పి ఎమ్ హెచ్ హాస్టల్ ఎదురుగా సిఐటియు అనుబంధ సంఘం PMH ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ… గత కొన్ని నెలలుగా వేతనాలు రాకపోవడంతో తమ పరిస్థితి దీనంగా తయారైందని అన్నారు. తమచే ఊడిగం చేయించుకుంటున్న పాలకులు సకాలంలో వేతనాలు వేయకపోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వెలువచ్చారు. తమ న్యాయ సమ్మతమైన డిమాండ్ పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా 18 నెలల వేతనాలు చెల్లించాలని,క్యాటరింగ్ విధానం రద్దు చెయ్యాలి,జీ ఓ నెం.60 ప్రకారం రూ.15,600 చెల్లించాలి,ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘం PMH ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు చందా జలందర్, గనిబోయిన లక్ష్మీ, కుర్సం మానస, గొంది ఉదయ లక్ష్మీ, అలెం స్వరూప,పాయం సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !