+91 95819 05907

నిరుపేదలకు ఇంటి స్థలం కేటాయించాలని CPM డిమాండ్

జూలూరుపాడు, నేటి గదర్ ప్రతినిధి, మండల పరిధిలో ఇంటి స్థలం లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూమిని తక్షణమే పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పడమట నర్సాపురం రెవెన్యూ పరిధిలో గల 162 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాస నరేష్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ నర్సాపురం గ్రామంలోని 162 సర్వేనెంబర్ లో గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు వెంటనే స్వాధీనం చేసుకొని మండల వ్యాప్తంగా ఉన్న ఇండ్ల స్థలాలు లేని అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని అనేక మార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను గిరిజనేతరులు సాగు చేయకుండా కౌలు, ఇతర మార్గాల ద్వారా లక్షలు గడిస్తున్నారని తెలిపారు. ఇప్పటి కైనా అట్టి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఇంటి స్థలం లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని, లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అట్టి భూములలో గుడిసెలు వేయించి ఇండ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు భానోత్ ఈశ్వర్, లాకావత్ శ్రీను, పార్టీ శాఖ కార్యదర్శి బానోత్ రూప, అభిమిత్ర, పార్టీ సీనియర్ నాయకులు బొల్లి లక్ష్మయ్య, నాగేశ్వరరావు, భూక్య బిచ్చు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »