+91 95819 05907

ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు.

– ఏజెన్సీలో ఉద్యోగాలలో అరుదైన రికార్డు.

* గ్రామానికి పేరు తెచ్చినందుకు గ్రామస్థుల అభినందనలు.
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఒక్క ఉద్యోగం కోసం అనేకమంది విద్యార్థులు లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో సంవత్సరాల పాటు కోచింగ్ లు తీసుకున్న ఉద్యోగాలు సాధించలేని పరిస్థితి ఈ కాలంలో నెలకొంది. ఒక్క ఉద్యోగం వస్తే చాలు జీవితాంతం తన కుటుంబం భరోసాతో బతుకుతుందని ఆశతో అనేకమంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న ఈ ప్రపంచంలో ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. కాని ఒకే సారి నాలుగు ఉద్యోగాలు(జూనియర్ లెక్చరర్, టీజిటీ -ఇంగ్లీష్, టీజిటీ – మ్యాస్, పిజీటీ – ఇంగ్లీష్) వచ్చాయంటే నమ్మశక్యంగా అనిపించదు. అదికూడా ఏజెన్సీ ప్రాంతంలో కూలీ పని చేసే ఇంట్లో ఆడబిడ్డకు ఇటువంటి అరుదైన అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పినపాక నియోజకవర్గం, కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మలకం రమాదేవి చదువుతున్న సమయంలో తండ్రిని కోల్పోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును విడవకుండా పట్టుదలతో, అకుంటితదీక్షతో తన చదువును కొనసాగించింది. భద్రాచలం ఏజెన్సీ బి ఎడ్ పూర్తి చేసుకొని ఉద్యోగమే లక్ష్యంగా చదువుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గురుకుల ఫలితాల్లో పిజి మరియు
జె ఎల్ లు ఏకకాలంలో ఉద్యోగాలు సాధించింది.
ఒకేసారి రమాదేవి నాలుగు ఉద్యోగాలు రావడంతో గ్రామ ప్రజలు ఆమెను అభినందించారు.

– కూనవరం మాజీ సర్పంచ్ ఏనిక ప్రసాద్ అభినందన.
ఇష్టపడి చదివితే ఎవరైనా ఉద్యోగాలు సాధించవచ్చునని, అందుకు రమాదేవి నిదర్శనమని కూనవరం మాజీ సర్పంచ్ ఎన్నిక ప్రసాద్ అన్నారు. ఆదివాసి బిడ్డను ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది అనేక ఉన్నత శిఖరాలు సాధించేందుకు ముందడుగు వేయాలని, ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత పొందిన రమాదేవిని ఆయన అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !