+91 95819 05907

BHADRACHALAM:ప్రతి సభ్యుడు లేబర్ కార్డు కలిగి ఉండాలి:. చుక్క సుధాకర్

*ప్రతినెల జరిగే సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ పూర్తిస్థాయిలో హాజరు కావాలి
*లేబర్ కార్డు పొందిన సభ్యులకు మాత్రమే ప్రభుత్వ పరిహారం
*ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాచలం యూనియన్ సభ్యుల సమావేశం
*యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ చుక్క సుధాకర్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:జిల్లాలో ఎలక్ట్రీషియన్ యూనియన్ లో కొనసాగే ప్రతి సభ్యుడు ప్రతి సభ్యుడు లేబర్ కార్డు కలిగి ఉండాలి అని తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చుక్క సుధాకర్ అన్నారు. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాచలం యూనియన్ సభ్యుల సమావేశం శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సభ్యులకు సంబంధించి పలు అంశాలు చర్చించారు. ప్రతి సభ్యుడు విధిగా ప్రతినెల 1న జరుగు సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ పూర్తిస్థాయిలో హాజరవ్వాలని …అటువంటి సభ్యులకు మాత్రమే యూనియన్ లో సభ్యత్వం కొనసాగించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి సభ్యుడు తన యొక్క లేబర్ కార్డును కచ్చితంగా పొంది ఉండాలని ,లేబర్ కార్డు పొందిన సభ్యుడు మాత్రమే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడానికి అర్హుడని తెలియజేశారు. యూనియన్ ను మరింత పటిష్టం చేసి ముందుకు నడపడానికి యూనియన్ నాయకులను ,కార్యవర్గ సభ్యులను ఎన్నుకోడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. సభ్యులలో యూనియన్ కి సేవ చేయగలిగిన సభ్యులు వారంలోపు పేర్లు జిల్లా అధ్యక్షులు కమిటీ కి ఇవ్వవలసినదిగా సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని తెలియజేశారు. బాధ్యతారహితంగా నడుచుకునే సభ్యులను యూనియన్ నుండి తొలగించబడునని, ప్రతి సభ్యుడు కూడా ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు కచ్చితంగా సర్వసభ్య సమావేశానికి హాజరవ్వాలని లేనిచో
ఆ సభ్యుని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయబడుతుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆ సంఘం సెక్రటరీ SK.రహీం, ట్రెజరర్
M.పుల్లారావు, గౌరవాధ్యక్షులు చీపుర్ల శ్రీనివాస్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !