+91 95819 05907

BHADRACHALAM:ప్రతి సభ్యుడు లేబర్ కార్డు కలిగి ఉండాలి:. చుక్క సుధాకర్

*ప్రతినెల జరిగే సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ పూర్తిస్థాయిలో హాజరు కావాలి
*లేబర్ కార్డు పొందిన సభ్యులకు మాత్రమే ప్రభుత్వ పరిహారం
*ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాచలం యూనియన్ సభ్యుల సమావేశం
*యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ చుక్క సుధాకర్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:జిల్లాలో ఎలక్ట్రీషియన్ యూనియన్ లో కొనసాగే ప్రతి సభ్యుడు ప్రతి సభ్యుడు లేబర్ కార్డు కలిగి ఉండాలి అని తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చుక్క సుధాకర్ అన్నారు. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ భద్రాచలం యూనియన్ సభ్యుల సమావేశం శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సభ్యులకు సంబంధించి పలు అంశాలు చర్చించారు. ప్రతి సభ్యుడు విధిగా ప్రతినెల 1న జరుగు సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ పూర్తిస్థాయిలో హాజరవ్వాలని …అటువంటి సభ్యులకు మాత్రమే యూనియన్ లో సభ్యత్వం కొనసాగించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి సభ్యుడు తన యొక్క లేబర్ కార్డును కచ్చితంగా పొంది ఉండాలని ,లేబర్ కార్డు పొందిన సభ్యుడు మాత్రమే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడానికి అర్హుడని తెలియజేశారు. యూనియన్ ను మరింత పటిష్టం చేసి ముందుకు నడపడానికి యూనియన్ నాయకులను ,కార్యవర్గ సభ్యులను ఎన్నుకోడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. సభ్యులలో యూనియన్ కి సేవ చేయగలిగిన సభ్యులు వారంలోపు పేర్లు జిల్లా అధ్యక్షులు కమిటీ కి ఇవ్వవలసినదిగా సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని తెలియజేశారు. బాధ్యతారహితంగా నడుచుకునే సభ్యులను యూనియన్ నుండి తొలగించబడునని, ప్రతి సభ్యుడు కూడా ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు కచ్చితంగా సర్వసభ్య సమావేశానికి హాజరవ్వాలని లేనిచో
ఆ సభ్యుని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయబడుతుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆ సంఘం సెక్రటరీ SK.రహీం, ట్రెజరర్
M.పుల్లారావు, గౌరవాధ్యక్షులు చీపుర్ల శ్రీనివాస్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

 Don't Miss this News !