+91 95819 05907

KARAKAGUDEM: నేతకాని కులస్థుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బడ్జెట్ కేటాయించాలి

*నేతకాని కులానికి రాష్ట్ర రాజధానిలో కుల భవనం ఏర్పాటు చేయాలి
*ఏజెన్సీ నేతకాని సంఘం అధికార ప్రతినిధి జాడి శ్రీనివాసరావు.

నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రికొత్తగూడెం జిల్లా:
నేతకాని కులస్థుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించి, బడ్జెట్ కేటాయించాలని ఏజెన్సీ నేతకాని సంఘం అధికార ప్రతినిధి జాడి శ్రీనివాసరావు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలనీ డిమాండ్ చేశారు. బుధవారం కరకగుడెం మండల కేంద్రం లో ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…. వందలాది సంవత్సరాలుగా, తర తరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి, పెరిగి , కులీ నాలీ చేసుకుని బ్రతుకుతున్నామని అన్నారు. మా బ్రతుకులు మారాలంటే పుట్టిన ప్రాంతం లో భూమి పై భుక్తి పై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాకు హక్కులు కల్పించాలని , నేతకాని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నేతకాని కులస్తులకు ఆర్థికంగా సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని వేదికగా హైదరాబాద్ లో మా కుల భవనానికి 10 ఎకరాల స్థలం కేటాయించి, నిధులు సమకూర్చి, కుల భవనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మా కుల పేరు నేతకాని అయితే గెజిట్ లో నెట్ కానీ గా రావడం బాధ కరమని ఆవేదన వ్యక్తం చేశారు. గెజిట్ లో వచ్చే అట్టి అచ్చు తప్పుని సరి చేసి నేతకాని గా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి పేదవాడికి బ్రతుకు దెరువు చూపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలను కోరారు. మా సమస్యలను పరిష్కరించకుంటే మా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని అధ్వర్యంలో దశల వారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ సమావేశంలో బాడిశ.లక్ష్మయ్య. గోగు.వీరస్వామి. గోగు.శ్రీను, గోగు.క్రిష్ణ, జనగం.చందు. జాడి.రామనాథం, గోగు. కిరణ్, రాంటెంకి. సమ్మయ్య, డా.సల్లూరి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !