+91 95819 05907

KARAKAGUDEM: నేతకాని కులస్థుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బడ్జెట్ కేటాయించాలి

*నేతకాని కులానికి రాష్ట్ర రాజధానిలో కుల భవనం ఏర్పాటు చేయాలి
*ఏజెన్సీ నేతకాని సంఘం అధికార ప్రతినిధి జాడి శ్రీనివాసరావు.

నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రికొత్తగూడెం జిల్లా:
నేతకాని కులస్థుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించి, బడ్జెట్ కేటాయించాలని ఏజెన్సీ నేతకాని సంఘం అధికార ప్రతినిధి జాడి శ్రీనివాసరావు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలనీ డిమాండ్ చేశారు. బుధవారం కరకగుడెం మండల కేంద్రం లో ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…. వందలాది సంవత్సరాలుగా, తర తరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి, పెరిగి , కులీ నాలీ చేసుకుని బ్రతుకుతున్నామని అన్నారు. మా బ్రతుకులు మారాలంటే పుట్టిన ప్రాంతం లో భూమి పై భుక్తి పై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాకు హక్కులు కల్పించాలని , నేతకాని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నేతకాని కులస్తులకు ఆర్థికంగా సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని వేదికగా హైదరాబాద్ లో మా కుల భవనానికి 10 ఎకరాల స్థలం కేటాయించి, నిధులు సమకూర్చి, కుల భవనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మా కుల పేరు నేతకాని అయితే గెజిట్ లో నెట్ కానీ గా రావడం బాధ కరమని ఆవేదన వ్యక్తం చేశారు. గెజిట్ లో వచ్చే అట్టి అచ్చు తప్పుని సరి చేసి నేతకాని గా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి పేదవాడికి బ్రతుకు దెరువు చూపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలను కోరారు. మా సమస్యలను పరిష్కరించకుంటే మా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని అధ్వర్యంలో దశల వారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ సమావేశంలో బాడిశ.లక్ష్మయ్య. గోగు.వీరస్వామి. గోగు.శ్రీను, గోగు.క్రిష్ణ, జనగం.చందు. జాడి.రామనాథం, గోగు. కిరణ్, రాంటెంకి. సమ్మయ్య, డా.సల్లూరి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !