+91 95819 05907

KLP MHALAXMI -JV (కే ఎల్ పీ మహాలక్ష్మి జేవీ) ఓ బీ కంపెనీలో స్థాని కు లకు ఉపాధి కల్పించారా?

*కేవలం 20 % స్థానిక (స్థానిక యువత)మ్యాన్ పవర్ కి మాత్రమే ఉపాధి
*మణుగూరు సింగరేణి GM 70% ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అనే మాటలు ఉత్తి మాటలేనా?
* ఆ కంపెనీ తీరుపై స్థానికుల ఆగ్రహం

* మణుగూరు సమాచార కార్యకర్త కర్నె బాబురావు సమాచార హక్కు చట్టం దరఖాస్తు తో నిజాలు బట్టబయలు
* స్థానిక యువకుల ఉపాధి కోసం పోరాడుతా: సామాజిక కార్యకర్త, WGL-KMM- NGLపట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కర్నె రవి

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సాక్షాత్తు సింగరేణి జిఎం స్థానిక యువతకు మణుగూరు ఓబి కంపెనీలలో 70 శాతం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. కానీ ఉత్తుత్తి మాటలే అని.. సమాచార హక్కు చట్టం దరఖాస్తు తో ఓ ఓబి కంపెనీ నిర్వాహకం తేటతెల్లమయింది. సమాచార హక్కు ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు మండలం oc లలో ఓబి తీయడానికి పలు ప్రైవేట్ కంపెనీలు సింగరేణి తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. మణుగూరు ఏరియాలో దుర్గా కంపెనీ,VR కంపెనీ,KLP MHALAXMI -JV కంపెనీలు OB కార్మికులను నియమించుకొని పనులు చేపడుతున్నారు. నిబంధనల మేరకు స్థానిక యువతకు 70 % ఉపాధి కల్పిస్తామని పలు వేదికలపై మణుగూరు సింగరేణి జిఎం ప్రకటించినట్లు సమాచారం. కానీ ఆయా ఓబీ కంపెనీలు తమ ఇష్టానుసారంగా స్థానికులకు అన్యాయం చేస్తూ స్థానికేతరులను అధిక సంఖ్యలో నియమించుకున్నట్లు సమాచార హక్కు చట్టం 2005 ద్వారా బట్టబయలు అయింది.KLP MHALAXMI -JV లో 851 కార్మికులు ఉండగా వారిలో 282 మంది స్థానిక యువకులకు మాత్రమే ఉపాధి కల్పించారు. దీనితో ఆ కంపెనీ వ్యవహరిస్తున్న తీర్పట్ల మణుగూరు పరిసర ప్రాంతాల స్థానిక యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్య దృష్టి సారించి తక్షణమే ఆయా ఓబి కంపెనీలలో 70% అవకాశం స్థానిక యువతకు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి జిఎం ఎలా స్పందిస్తారు వెయిట్ చేయాల్సిందే మరి.

ఓబి కంపెనీలలో స్థానిక యువకుల ఉపాధి కోసం పోరాడుతా: Karne Ravi మణుగూరు సింగరేణి ఓబి కంపెనీలలో ఓబి కాంటాక్ట్ దక్కించుకున్న గుత్తేదారులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దారుణం అని సామాజిక కార్యకర్త, WGL-KMM- NGLపట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కర్నె రవి మండిపడ్డారు. సింగరేణి జిఎం స్థానిక యువతకు ఓబీ కంపెనీలలో 70 శాతం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికి కార్యరూపం దాల్చలేదన్నారు. స్థానిక యువతకు ఓబి వెలికి తీసే కంపెనీలలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి తరఫున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !