+91 95819 05907

KTDM: ముఖ్యమంత్రి పర్యటన ఖరారు. ఆ శాఖల అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫెరెన్స్

*జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పలు శాఖ ల అధికారులతో టెలికాన్ఫరెస్
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఈ నెల 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు ఐనట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథక ప్రారంభం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్, ఎస్పీ రోహిత్ జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఇతర క్యాబినెట్ మంత్రులతో కలిసి భద్రాచలం పర్యటించనున్నారని తెలిపారు.
ఉదయం ముందుగా
సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని, మిథిలా స్టేడియంలో ఏర్పాటుచేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటారని, తదుపరి, అక్కడే ఏర్పాటు చేసిన సభలో మూడు వేలమంది ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభిస్తారని, తదుపరి భోజన అనంతరం, మణుగూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారనితెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో మాట్లాడుతూ హెలిపాడ్ ఏర్పాట్లు, భద్రత ఏర్పాట్లు, క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. హేలిపాడ్ వద్ద అంబులెన్స్, డాక్టర్లు, ఫైర్ ఇంజన్, మొదలగు అత్యవసర ఏర్పాట్లుచేయాలన్నారు.

ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ తో మాట్లాడుతూ కళ్యాణ మండపం వద్ద ఎలక్ట్రికల్,జనరేటర్, ఏసీల ఏర్పాటు వాహనాల పార్కింగ్ కొరకు వసతి ఏర్పాట్లు పర్యవేక్షించలన్నారు.
ముఖ్యమంత్రి దైవదర్శనం, సమీక్షా సమావేశం, ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజలకు సిట్టింగ్ అరేంజ్మెంట్, మంచి నీటి వసతి, పరిశుద్ధ శాఖాహార భోజన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆర్డీవో భద్రాచలం ను ఆదేశించినైనది.

సీతమ్మ సాగర్ ప్రాజెక్టుపై జరిగిన, జరగవలసిన పనులు పూర్తి నివేదిక సిద్ధం చేసుకోవాలని ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.
బార్కేడింగ్ ఏర్పాట్లు, హెలిపాడ్ ఏర్పాట్లు, కుర్చీలు ఏర్పాట్లు, మణుగూరులో జరిగే బహిరంగ సభ, ఏర్పాట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు ను ఆదేశించారు.

భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసుకోవాలని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవిని ఆదేశించారు.

భద్రాద్రి కొత్తగూడెం డిఆర్ఓ రవీంద్రనాథ్ ను అన్ని ఏర్పాట్లపై పర్యవేక్షించవలసిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదేశించారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ రవీంద్రనాథ్, డి ఆర్ డి ఓ విద్యాచందన, జిల్లా పరిపాలన అధికారి గన్య, డి ఎం హెచ్ ఓ శిరీష, డీఎస్ఓ రుక్మిణి, భద్రాచలం ఆర్టీవో కే దామోదర్ రావు, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు , ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య, ఇరిగేషన్ ఈఈ అర్జున్ , మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !