+91 95819 05907

BHADRACHALAM : ఫాసిస్టు మతోన్మాదులను ఓడించి విప్లవశక్తులను ఐక్యం చేయడమే రాయలసుభాష్ చంద్రబోస్ కి అర్పించే నిజమైన నివాళి

★ CPIML మాస్ లైన్ ప్రజాపందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చేలా రంగారెడ్డి
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:ఫాసిస్టు మతోన్మాదులను ఓడించి విప్లవశక్తులను ఐక్యం చేయడమే రాయలసుభాష్ చంద్రబోస్ కి అర్పించే నిజమైన నివాళి అని CPIML మాస్ లైన్ ప్రజాపందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చేలా రంగారెడ్డి అన్నారు.
భద్రాచలం పట్టణ కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంద పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 8 వ వర్ధంతి జరపడం జరిగింది. తొలుత సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి అపార్టీ నాయకులు నివాళులర్పించారు .అనంతరం ఏర్పాటు చేసిన రాయల సుభాష్ చంద్రబోస్ 8 వ వర్ధంతి సభకు హాజరైన కెచ్చల రంగారెడ్డి మాట్లాడుతూ… ప్రజా పంథామార్గంలో ప్రజా ఉద్యమాలను నడిపించి దోపిడీ పాలకవర్గాలకు, మతోన్మాద ఫాసిస్టు, కార్పొరేట్ పెట్టుబడిదారీ వర్గాల కు వ్యతిరేకంగ పోరాడమే సుభాష్ చంద్రబోస్ కి ఇచ్చే ఘనమైన నివాళిని అన్నారు. రాయల సుభాష్ చంద్రబోస్ సుమారు 50 సంవత్సరాలు పాటు జీవితాంతం ప్రజలను చైతన్యవంతం చేస్తూ, దేశంలో పెరిగిపోతున్న దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా విప్లవ పార్టీలన్నీ కలిసి పోరాడాలని కోరుకున్నారని ఆయన అన్నారు. సుభాష్ చంద్రబోస్ తెలంగాణ రైతంగా పోరాటంవిప్లవ పాఠాలతో, జాతీయోద్యమ పోరాటాల స్ఫూర్తి తోటి, భారతదేశంలో జరిగిన అనేక కార్మిక రైతు పోరాటాలు స్ఫూర్తితో జాతీయస్థాయిలో ఎది గాడని ఆయనన్నారు.ప్రజా పోరాటాలలో అనేకమంది అమరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని వారి త్యాగాలను వృధా పోనీయకుండా ముందుకు తీసుకుపోవాలని రాయల సుభాష్ చంద్రబోస్ ఆకాంక్షించారని ఆయన అన్నారు. నేడు దేశంలో బిజెపి ఆర్ఎస్ఎస్ పాసిస్తూ మతోన్మాదం తీవ్రంగా పెరిగిపోయి ప్రజల మీద అమానుష దాడులను కొనసాగిస్తున్నదని, నేడు అదే ప్రమాదకర స్థితిలో ఉన్నదని ప్రజలందరూ కూడా వామపక్ష శక్తులందరూ కూడా ఐక్యంగా ఎదుర్కొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను కూడా నేడు హరిస్తున్నారని అన్నారు రాయల సుభాష్ చంద్రబోస్ నమ్మిన ఆశయాలు సిద్ధాంతాలు సఫలీకృతం కావాలంటే విప్లవశక్తులందరూ కూడా ఐక్యం కావాలని అందుకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కృషి చేస్తుందని,రవి కూడా అదే కోరుకున్నారని ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందరూ కూడా ఆయన నడిచిన మార్గంలో ముందుకు నడవాలని ఆయన కోరారు. ప్రజల మీద దాడులు చేస్తున్న భూసాన్య పెత్తందారి వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి, ప్రశ్నించుటం నేర్పారని, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారాణి వారన్నారు అని పిలిపునిచ్చారు రాజ్యాంగబద్ధ హక్కులను కూడా హరిస్తున్న పరిస్థితిలో అన్ని దేశభక్తి శక్తులు ప్రజాస్వామ్యవాదులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కెచ్చల కల్పన పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ డివిజన్ నాయకులు భీమ్ రాజు, మునిగల శివ, కొండ కౌశిక్, కుమారి, నాగరత్నం శాంత రమ సిరితోష్ షకీరా, స్వాతి,మహేశ్వరి, ప్రసన్న, నసీమా,బ్లేస్సి పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !