+91 95819 05907

తెలంగాణ గవర్నర్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసి పేద కులాలకు చెందిన తమకు న్యాయం చెయ్యాలి:డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ,

*గవర్నర్ తమిళసై కి వినతి పత్రం అందజేత
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
ఎమ్మెల్సీ కావడానికి రాజ్యంగ పరంగా అన్ని అర్హతలు మాకున్నాయి. కోర్టు తీర్పుతో మా ప్రతిపాదనకు ప్రాణం వచ్చింది. తెలంగాణ గవర్నర్‌, హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసి పేద కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలంటూ బిఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్ కోరారు.

”రాజ్యంగ పరమైన అంశాలతో పాటు మా అర్హతలకు సంబధించిన అన్ని విషయాలు పరిశీలించన అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవ తెలంగాణ గవర్నర్‌ గారు అమలు చేసి పేదకులాలు చెందిన తమకు న్యాయం చేయాలి” అని కోరారు బిఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ నామినేషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో 31 జూలై 2023న మంత్రి మండలి చేసిన నామినేషను అమలు చేయాలని కోరుతూ డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ, గవర్నర్ కు వినతి పత్రం అందించారు.

అనంతరం మీడియాతో డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. 31, జూలై 2023న మంత్రి మండలి మమ్మల్ని ఎమ్మెల్సీ గా నామినేట్ చేస్తూ తీర్మానం చేసింది. దాదాపు యాబై రోజుల తర్వాత సెప్టెంబర్ 25న గవర్నర్ గారు మా నామినేషన్ ని తిరస్కరించారు. 07, 12, 23 దీనిపై మేము కోర్టులో కేసు వేశాం. వాదోపవాదాలు జరుగుతున్న నేపధ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం 27, 1, 2024న ప్రో కోదండరాం, అమీర్ ఆలీ ఖాన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ అదే రోజు ఆమోదం తెలుపుతూ గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నిటిని పరిశీలించిన హైకోర్టు మూడు ప్రధాన సూత్రలని తీర్పుగా ఇచ్చింది. మా నియామకాలని తిరస్కరించిన గవర్నర్ నిర్ణయం తప్పని చెబుతూ గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేసింది.
ప్రో కోదండరాం, అమీర్ ఆలీ ఖాన్ నియామకం చట్టవిరుద్ధమని, వారి నియామకం కూడా రద్దు చేసింది. అలాగే మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని గవర్నర్ గారు తప్పని సరిగా అమలు చేయాలనే ప్రాధమిక మూల సూత్రాన్ని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. దీంతో మా ప్రతిపాదనకు ప్రాణం వచ్చింది” అని పేర్కొన్నారు.

‘మేము పేద కులాలకు చెందిన వారము. వ్యాపారపరమైనటు వంటి రాజకీయాలో పేద కులాలకు చెందిన మాలాంటి వరకు అవకాశాలు రావు. ఇది మాకు గొప్ప అవకాశం. నేను పీ హెచ్డీ చదువుకున్నాను. ఎంబీఎ, యంఏ, ఎల్ఎల్ బి చేశాను. ఉస్మానియా యూనివర్సిసిటీలో ప్రోఫెసర్ గా పని చేశాను. ప్రజా ఉద్యమంలో వున్నాను. విద్యార్ధి ఉద్యమాల్లో వున్నాను. ఏబీవీపీలో పని చేశాను. వరల్డ్ బ్యాంకు ప్రాజెక్ట్ లో పని చేశాను. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో లక్షల జీతాన్ని వదిలి రాజకీయల్లోకి వచ్చాను. గత పదహారేళ్ళుగా ప్రజల గొంతుకై వున్నాను. నక్సల్ తో చర్చలు జరిపితేనే హింసకు చరమగీతం పాడినట్లు అవుతుందనే సూత్రంతో కుబుసం అనే చిత్రాన్ని నిర్మించాను. అందులోని పల్లెకన్నీరు పెడుతుందో పాట ప్రజలని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ పాటే 2004లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇటు సామాజిక రంగం, కళారంగం, అటు సేవారంగంలో విశేషమైన కృషి చేశాను” అని పేర్కొన్నారు.

‘రాజ్యంగబద్ధంగా జూలై 2023న మంత్రి మండలి మమ్మల్ని ఎమ్మెల్సీ గా నియామకం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)లో పేర్కొన్న అర్హత ప్రమాణాలకు మేము అర్హులం. అలాగే ఆర్టికల్ 191 ప్రకారం ఎటువంటి అనర్హత( Disqualifications )కూడా మాకు వర్తించదు. కాబట్టి గవర్నర్ గారు మమ్మల్ని పరిగణించాలి. తల్లిలాంటి గవర్నర్ గారు రాజ్యాంగాన్ని, మాలాంటి పేదవారిని కాపాడాలి. మాకు న్యాయం చేయాలి. కౌన్సిల్ కి వెళ్ళడానికి అన్ని అన్ని అర్హతలు వున్నాయి. కోర్టు వారు అన్ని విషయాలు పరిశీలించి తర్వాత ఇచ్చిన తీర్పుని గవర్నర్ గారు అమలు చేసి మాకు న్యాయం చేసి మా వర్గాలకు ప్రతినిధిగా చట్ట సభల్లోకి వెళ్ళే అవకాశం కల్పించాలి’ అని దాసోజు కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !