★ఓటు ప్రజల తలరాతను మార్చేది
★ప్రజలకు ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్న తహశీల్దార్
నాగప్రసాద్
నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం:ఇంటింటికీ తహశీల్దారు కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు బుధవారం చిరుమళ్ల,వట్టంవారిగుంపు గ్రామపంచాయతి పరిధిలోని గ్రామాలలో కరకగూడెం తహశీల్దారు నాగప్రసాద్ ఇంటింటికీ తిరుగుతూ ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఇంటింటికీ తహశీల్దార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం మండలంలోని 16 గ్రామపంచాయతిలో జరుతుందని,ప్రజలనుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య భారతంలో ఓటు ప్రజల తలరాతను మార్చేదన్నారు . అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తాసిల్దార్ సూచించారు . అలాగే ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది,గ్రామపంచాయతిల సిబ్బంది పాల్గొన్నారు.
