+91 95819 05907

ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల ఆగడాల పై CPI ML mass line ఆగ్రహం

●పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు ఫైనాన్స్ దోపిడీ దందాలు

*●100 కు 7రూపాయలు,10,000 వేలకు 12,000 వేల రూపాయలు, ఒక లక్ష కు 6500 రూపాయలని అధిక వడ్డీ లు గుంజుతున్న డైలీ వీక్లీ మంత్లీ ఫైనాన్స్ దందాలు
● ఆర్ధిక దోపిడికి మానసిక హింసకూ గురి అవుతున్న ఏజన్సీ వాసులు, పేదలు,చిరు వ్యాపారస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు
● అత్యసకు పోయి అధిక వడ్డీ వసూలు చేస్తే బాధితులను ఐక్యం చేసి పోరాటం చేస్తాం

●అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేటు వడ్డీ వ్యాపారలను కట్టడి చేయాలి

●CPI(ML) మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్

నేటి గద్దర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం పట్టణ కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో శనివారంజనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ భద్రాచలం డివిజన్లో చర్ల దుమ్ముగూడెం భద్రాచలంలో ప్రైవేటు వ్యాపారస్తుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయని అన్నారు. పట్టణ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ఈ వడ్డీదంతా కొనసాగుతుందని అన్నారు. పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని వారి రక్తాన్ని ఫైనాన్స్ వ్యాపారులు జలగల పీలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారస్తులైన తోపుడు బండ్లు ,చాటు, చికెన్, చిల్లర దుకాణాలు, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాపారం కొనసాగుతుందనీ అన్నారు. తమ వద్దకు అప్పుకు వచ్చేవారి అవసరాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వడ్డీ వసూలు చేస్తున్నారనీ చిరు వ్యాపారస్తులు తోపుడుబండ్ల నిర్వాహకులు ఏరోజుకారోజు జరిగే వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తుంటారు. పెట్టుబడుల కోసం డైలీ ఫైనాన్స్ వారిని ఆశ్రయిస్తూ ఉంటారు ఉదయం 900 ఇస్తే సాయంత్రానికి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే రోజుకి ఒక్కొక్కరిపై 100 రూపాయలు వసూలు చేస్తున్నారనేది అర్థమవుతుంది. మరికొందరు 9000 రూపాయలు ఇచ్చి ఒక్క వారంలో పదివేల రూపాయలు రూపాయలు వసూలు చేస్తున్నారు దీన్నిబట్టి చూస్తే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందనేది అర్థమవుతుంది. సకాలంలో వడ్డీ అప్పు కట్టకపోతే వారి ఇంటిని భూమిని వాహనాలను తనకా పెట్టుకుంటున్నారు ఈ వ్యాపారం పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది. అయినప్పటికీ ఇంత జరుగుతున్న అధికారులు ఏమి పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది అత్యంత ధారణంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ పరిగణిస్తుంది వెంటనే అధికారులు స్పందించి చట్టం విరుద్ధంగా నడుస్తున్న ఈ ఫైనాన్స్ వడ్డీ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల కచ్చితంగా బాధిత ప్రజల తరఫున పోరాటం నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు దాసరి సాయన్న కొండ కౌశిక్ చన్న0 మోహన్ రాజు, వీరన్న తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !