+91 95819 05907

నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు.బూటకపు ఎన్ కౌంటర్లకు కాంగ్రెస్ ,CM రేవంత్ బాధ్యత వహించాలి

🔥 ములుగు ఎస్పీ కనుసన్నల్లోనే ఈ ఎన్ కౌంటర్ల పరంపర

🔥 పూజార్ కాంకేర్ మృతులకు లాల్ సలాం
🔥మావోయిస్టులపై అటు తెలంగాణ. ఇటు చత్తీసద్ మహారాష్ట్ర పోలీసులు రాజ్యహింసకు తెగబడుతున్నారు
🔥ఆదివాసీ ఉద్యమాలను రాక్షసంగా అనగదొక్కు తున్నారు
🔥భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్)
నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:బూటకపు ఎన్ కౌంటర్లకు కాంగ్రేసే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ శనివారం ఆజాద్ పేరు మీద ప్రకటన విడుదల చేసింది.
ఏ పార్టీ అధికారంలో ఉన్న రాజ్యం స్వభావం మారదని, ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టులపై అటు తెలంగాణ. ఇటు చత్తీసద్ మహారాష్ట్ర పోలీసులు రాజ్యహింసకు తెగబడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు .కార్పోకేట్ కంపనీల అడుగులకు మరుగులొత్తేలా వారు పనిచేస్తున్నారు. ఈ హింసలో పార్టీలది ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీ లది ఒకటే వ్యూహం, ఒకటే దారి. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యం తో పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నా పాలించే విధానంలో ఎలాంటి మార్పూ లేదని అన్నారు.అదివాసీ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజాలు, వనరులను పెద్ద పెద్ద కంపనీలకు, సామ్రాజ్య వాద తొత్తులకు గుండుగుర్తగా తాకట్టు పెట్టే క్రమంలో అక్కడ ఉన్న ఆదివాసీ ఉద్యమాలను రాక్షసంగా అనగదొక్కు తున్నారు. దండకారణ్యం అంతా పోలీసు ర్యాంపులతో విలపిస్తున్నాయి. ఓ పక్క డ్రోన్లు, హెలీకాప్టర్లలో ఆకాశ మార్గంగుండా దాడులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర సరిహద్దులో ముగ్గురు కామ్రేడ్స్ పై విష ప్రయోగం చేసి పట్టుకొని అతి కిరాతకంగా హింసించి ఎస్ కౌంటర్ కథంల్లారు. ఈ రోజు బీజాపూర్ జిల్లా డిసూర్ బ్లాక్ పూజారికాంకేర్ తెలంగాణ గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ. కోలా పోలీసులకి ,మావోయిస్టులకు మధ్య జరిగిన భయంకర యుద్ధంలో మా కామ్రేడ్స్ ముగ్గురు అమరులయ్యారని తెలిపారు. తెలంగాణ ఎస్ జెడ్పీ సభ్యులు కామ్రేడ్ సాగర్ తో పాటు కామ్రేడ్ మణిరాం (ఏపీఎం) మరో కామ్రేడ్ ముగ్గురూ అమరులయ్యారు. వారికి మావోయిస్టు పార్టీ విప్లవ జ్యోహార్లు అర్పిస్తుంది. వారి పోరాట పటిమను కొనియాడుతూ వారికి లాల్ సలామ్ తెలుపుతుంది. వారి ఎన్ కౌంటర్ కారకులైన ములుగు ఎస్సీ. పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా పరిపాలించిన కేసీఆర్ మావోయిస్టు ఎజెండానే తన తండాలని అధికారం చేపట్టాక మావోయిస్టు నిర్మూలించడానికి ఒక నియంతగా వ్యవహరించాడు. అదే తరహాలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను పరిరక్షిస్తానని ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతానని చెప్పి మావోయిస్టు పార్టీపై తన పోలీసు బంగాంతో దాడులు చేసిస్తూ పాలించే వాళ్ళంతా ఒకే గూటి పక్షులని రాజ్యహింసలో ఒకడిని మంచిన వాడు ఇంకొకడు అన్నట్లు కార్పోరేట్ ఏజెంట్లే పని రుజువు చేసుకున్నడు. ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో మా కామ్రేడ్స్ పై ములుగు జిల్లా ఎస్సీ పథకం రచించి ఈ ఎన్ కౌంటర్ కు పాల్పడ్డాడు. తప్పకుండా ఈ ఎన్కౌంటర్ కు నెత్తుటి బాకీ తీర్చుకుంటామని ప్రకటించారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !