+91 95819 05907

పార్టీ ఫిరాయింపుల గురించి బిఆర్ఎస్ పార్టీ మాట్లాడటం సిగ్గుచేటు

నేటి గద్ధర్ న్యూస్, భద్రాచలం:

◆ఈ విషయంలో రేగా కాంతారావు,MLC తాత మధువ్యవహారం చూస్తుంటే గురువింద సమేత గుర్తు వస్తుంది

◆మీ తీరీ ప్రకారమే ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కాంగ్రెస్ లో చేరడం న్యాయమే కదా

◆సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్
పార్టీ ఫిరాయింపుల గురించి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడటం సిగ్గుచేటని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా.చరణ్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం.వెంకట్రావు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయమై న్యాయపోరాటం చేస్తానని అంటున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలో తాను చేసిందేమిటో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అభివృద్ధి వంకతో గులాబీ గూటికి చేరిన రేగా కాంతారావు ఇప్పుడు డాక్టర్ తెల్లం.వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరితే రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని అన్నారు.ఎమ్మెల్సీ తాతా మధు, రేగా కాంతారావుల తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తున్నదన్నారు.ఆనాడు రేగా కాంతారావు పార్టీ మారితే తప్పు కానిది నేడు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తాను చేస్తే సంసారం మరొకరు చేస్తే వ్యభిచారం అన్న చందంగా వారు మాట్లాడుతున్నారని అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే కారు ఖాళీ అవుతుందని బిఆర్ఎస్ నాయకత్వానికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరవచ్చని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !