+91 95819 05907

పార్టీ ఫిరాయింపుల గురించి బిఆర్ఎస్ పార్టీ మాట్లాడటం సిగ్గుచేటు

నేటి గద్ధర్ న్యూస్, భద్రాచలం:

◆ఈ విషయంలో రేగా కాంతారావు,MLC తాత మధువ్యవహారం చూస్తుంటే గురువింద సమేత గుర్తు వస్తుంది

◆మీ తీరీ ప్రకారమే ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కాంగ్రెస్ లో చేరడం న్యాయమే కదా

◆సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్
పార్టీ ఫిరాయింపుల గురించి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడటం సిగ్గుచేటని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా.చరణ్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం.వెంకట్రావు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయమై న్యాయపోరాటం చేస్తానని అంటున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలో తాను చేసిందేమిటో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అభివృద్ధి వంకతో గులాబీ గూటికి చేరిన రేగా కాంతారావు ఇప్పుడు డాక్టర్ తెల్లం.వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరితే రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని అన్నారు.ఎమ్మెల్సీ తాతా మధు, రేగా కాంతారావుల తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తున్నదన్నారు.ఆనాడు రేగా కాంతారావు పార్టీ మారితే తప్పు కానిది నేడు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తాను చేస్తే సంసారం మరొకరు చేస్తే వ్యభిచారం అన్న చందంగా వారు మాట్లాడుతున్నారని అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే కారు ఖాళీ అవుతుందని బిఆర్ఎస్ నాయకత్వానికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరవచ్చని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !