+91 95819 05907

పార్టీ ఫిరాయింపుల గురించి బిఆర్ఎస్ పార్టీ మాట్లాడటం సిగ్గుచేటు

నేటి గద్ధర్ న్యూస్, భద్రాచలం:

◆ఈ విషయంలో రేగా కాంతారావు,MLC తాత మధువ్యవహారం చూస్తుంటే గురువింద సమేత గుర్తు వస్తుంది

◆మీ తీరీ ప్రకారమే ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కాంగ్రెస్ లో చేరడం న్యాయమే కదా

◆సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్
పార్టీ ఫిరాయింపుల గురించి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడటం సిగ్గుచేటని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా.చరణ్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం.వెంకట్రావు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయమై న్యాయపోరాటం చేస్తానని అంటున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలో తాను చేసిందేమిటో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అభివృద్ధి వంకతో గులాబీ గూటికి చేరిన రేగా కాంతారావు ఇప్పుడు డాక్టర్ తెల్లం.వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరితే రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని అన్నారు.ఎమ్మెల్సీ తాతా మధు, రేగా కాంతారావుల తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తున్నదన్నారు.ఆనాడు రేగా కాంతారావు పార్టీ మారితే తప్పు కానిది నేడు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తాను చేస్తే సంసారం మరొకరు చేస్తే వ్యభిచారం అన్న చందంగా వారు మాట్లాడుతున్నారని అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే కారు ఖాళీ అవుతుందని బిఆర్ఎస్ నాయకత్వానికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరవచ్చని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !