+91 95819 05907

అధికార పార్టీ కనుసైగల్లో భూకబ్జాలు…?

– భూ యజమానులపై భౌతిక దాడులు చేస్తున్న వైనం
– కాళీ జాగా కనపడితే చాలు అంతా మాదే
– ప్రభుత్వ పాలనలో రాక్షస పాలన
– నాకు న్యాయం చేయండి మహాప్రభో అంటున్న భూ బాధితుడు సోయం విష్ణుమూర్తి
– ఆ నాయకుడు చేష్టలకు ప్రజలు బెంబేలు
నేటి గద్ధర్ న్యూస్, పినపాక నియోజకవర్గ ప్రతినిధి : మండలంలోని భూములు ఖాళీగా కనపడితే చాలు అంతా మాదే అంటూ, కబ్జాలకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. భూ కబ్జాదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండగా నిలుస్తూ, అసలు భూ యజమానులను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మండలంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఈసం భవతి తన ఇంటి పక్కన ఉన్న ఐదు సెంట్ల భూమి తనదే అంటూ భూ కబ్జాకు పాల్పడింది. ఆ గ్రామానికి చెందిన సోయం విష్ణుమూర్తి, తన తాతల కాలం నాటి భూమి కావడంతో తనకు సంక్రమిస్తూ వస్తుంది. తన తాతల కాలంలో వేల ఎకరాల భూమిని ఊరు అభివృద్ధి కోసం ఎంతోమందికి దానం దత్తం చేశారని తెలిపారు. ఈసం భవతి ఇంటి పక్కన ఐదు సెంట్ల భూమిని, కబ్జా చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులపై కూడా భౌతికంగా దాడులకు దిగుతుందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా తన సొంత భూమి కోసం ఈసం భవతి, కొంతమంది కాంగ్రెస్ నాయకుల అండ,దండలు చూసుకొని రెచ్చిపోతున్నారని అన్నారు. ఈ విషయంపై పినపాక తాసిల్దార్ కు ఫిర్యాదు చేయగా, విచారణకు వస్తానని ఆ భూమి మీదకి ఎవరు వెళ్లొద్దని సూచించారు. మాజీ సర్పంచ్ అధికారులు లేని సమయంలో ట్రాక్టర్ల ద్వారా, మట్టి పోసేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లగా తన కుటుంబ సభ్యుల పై దాడులకు దిగడమే కాకుండా ఇష్టానుసారంగా బూతులు తిడుతూ,ఇష్టానుసారంగా ప్రవర్తించందని తెలిపారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ ఈసం భవతి కాంగ్రెస్ పార్టీకి చెందిన బుల్ రెడ్డి అనే నాయకుడికి తెలపడంతో అ ప్రదేశానికి వచ్చి , పరిశీలించి మీరు స్టేషన్ లో కేసు పెట్టండి, నేను చూసుకుంటాను అంటూ అండగా నిలిచారని వాపోయారు. అంతేకాకుండా బుధవారం తన మహిళ బంధువు పై బూతులు తిడుతూ,,, దౌర్జన్యంగా భౌతిక దాడికి దిగి, వస్త్రాలను సైతం చించి వేసిందని తెలిపారు. తోటి మహిళ అని చూడకుండా , వస్త్రాలను చించడం ఎంతవరకు సబబు కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండదండలతోనే ఈ తతంగం అంత చేస్తుందని తెలిపారు. ప్రజా పాలనలో రాక్షస పాలన జరుగుతుందని ప్రజలు ప్రశాంతంగా బతికేటట్లు లేరని వాపోయారు. ఆ భూమికి సంబంధించిన అన్ని హక్కులు నాకే ఉన్న ఆ కాంగ్రెస్ నాయకుడు మాత్రం ఎమ్మెల్యే పేరు చెబుతూ, భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని వాపోయాడు. ఆ కాంగ్రెస్ నాయకుడైన బుల్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే తన నైజాన్ని ప్రదర్శిస్తున్నాడని తెలిపారు. మాజీ సర్పంచ్ ఈసం భవతి గ్రామంలో మరి కోన్ని చోట్ల భూ కబ్జాలు చేసిందని వాపోతున్నాడు.మరి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే నిరుంకశ పాలన చేయడం ,కాంగ్రెస్ నాయకులు అడ్డు అదుపు లేకుండా పోతుందని అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

 Don't Miss this News !