+91 95819 05907

BCM:బడులు మొదలయ్యే నాటికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలి:ITDA PO

– భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 19, భద్రాచలం :

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు తిరిగి పాఠశాలలు తెలిసే నాటికి ఏమైనా మరమ్మత్తులు ఉంటే చేయించే విధంగా సంబంధిత ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో పిఓ మాట్లాడుతూ… గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల విద్యను పటిష్టంగా అమలు చేయడానికి అలాగే విద్యాభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టి సారించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించుట కొరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకు ఏటీడీవో పరిధిలోని పాఠశాలల్లో కావలసిన మౌలిక వసతులు ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థుల హాజరు శాతం 100% ఉండేలా హెచ్ఎంలతో పాటు ప్రత్యేక అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా డార్మెటరీ రూములపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏ పాఠశాలలోనైనా డార్మెటరీ రూములు పాడైపోతే వెంటనే మరమ్మతులు చేయించాలని అన్నారు. మరుగుదొడ్లు టాయిలెట్ రూమ్స్ ఎన్ని పని చేస్తున్నవి, మరమ్మత్తులో ఉన్నవి వాటికి సంబంధించిన వివరాలు త్వరగా తెప్పించాలని డిడి ట్రైబల్ వెల్ఫేర్ కు ఆదేశించారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ రూమ్స్ మాత్రం పిల్లలకు పనికొచ్చే విధంగా తీర్చిదిద్దాలని,12 జూన్ లోగా డార్మెటు రూములు మంచిగా ఉండాలని అలాగే మంచాలు, డైనింగ్ హాల్స్ ,లాబరేటరీలు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అన్ని సక్రమంగా సమకూర్చాలని అన్నారు. పాఠశాలల్లో పనికిరాని స్క్రాప్ కు సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే సబ్ డివిజన్ కమిటీ ద్వారా వాటిని పరిశీలించి తొలగించాలని అన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు పాఠశాలలకు వైట్ వాష్ , ఫ్లోరింగ్ రిపేరింగ్, మంచాలు కటింగ్ చేయించి విద్యార్థులందరికీ అందే విధంగా చూడాలని అన్నారు. డార్మెటరీ మంచిగా చేయించిన తర్వాత వాటి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అవి పాడైపోయినట్టు తన దృష్టికి వస్తే సంబంధిత వార్డెన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, స్పెషల్ ఆఫీసర్లు తప్పనిసరిగా వారికి కేటాయించిన పాఠశాలలకు సందర్శిస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఎస్ఓ సురేష్ బాబు, ఉద్యానవన అధికారి అశోక్ కుమార్, ఏడీ అగ్రికల్చర్ భాస్కరన్, జేడియం హరికృష్ణ, ఏటీడీవోలు, జిసిడిఓ, డిఇలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

 Don't Miss this News !