+91 95819 05907

BCM:బడులు మొదలయ్యే నాటికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలి:ITDA PO

– భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 19, భద్రాచలం :

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు తిరిగి పాఠశాలలు తెలిసే నాటికి ఏమైనా మరమ్మత్తులు ఉంటే చేయించే విధంగా సంబంధిత ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో పిఓ మాట్లాడుతూ… గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల విద్యను పటిష్టంగా అమలు చేయడానికి అలాగే విద్యాభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టి సారించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించుట కొరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకు ఏటీడీవో పరిధిలోని పాఠశాలల్లో కావలసిన మౌలిక వసతులు ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థుల హాజరు శాతం 100% ఉండేలా హెచ్ఎంలతో పాటు ప్రత్యేక అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా డార్మెటరీ రూములపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏ పాఠశాలలోనైనా డార్మెటరీ రూములు పాడైపోతే వెంటనే మరమ్మతులు చేయించాలని అన్నారు. మరుగుదొడ్లు టాయిలెట్ రూమ్స్ ఎన్ని పని చేస్తున్నవి, మరమ్మత్తులో ఉన్నవి వాటికి సంబంధించిన వివరాలు త్వరగా తెప్పించాలని డిడి ట్రైబల్ వెల్ఫేర్ కు ఆదేశించారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ రూమ్స్ మాత్రం పిల్లలకు పనికొచ్చే విధంగా తీర్చిదిద్దాలని,12 జూన్ లోగా డార్మెటు రూములు మంచిగా ఉండాలని అలాగే మంచాలు, డైనింగ్ హాల్స్ ,లాబరేటరీలు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అన్ని సక్రమంగా సమకూర్చాలని అన్నారు. పాఠశాలల్లో పనికిరాని స్క్రాప్ కు సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే సబ్ డివిజన్ కమిటీ ద్వారా వాటిని పరిశీలించి తొలగించాలని అన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు పాఠశాలలకు వైట్ వాష్ , ఫ్లోరింగ్ రిపేరింగ్, మంచాలు కటింగ్ చేయించి విద్యార్థులందరికీ అందే విధంగా చూడాలని అన్నారు. డార్మెటరీ మంచిగా చేయించిన తర్వాత వాటి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అవి పాడైపోయినట్టు తన దృష్టికి వస్తే సంబంధిత వార్డెన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, స్పెషల్ ఆఫీసర్లు తప్పనిసరిగా వారికి కేటాయించిన పాఠశాలలకు సందర్శిస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఎస్ఓ సురేష్ బాబు, ఉద్యానవన అధికారి అశోక్ కుమార్, ఏడీ అగ్రికల్చర్ భాస్కరన్, జేడియం హరికృష్ణ, ఏటీడీవోలు, జిసిడిఓ, డిఇలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !