+91 95819 05907

పంట ఎండిపోతుంది .పాలకులు ఎక్కడ?

పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు.. కొర్స నర్సింహా మూర్తి

ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్ట్ నీళ్లు వృధా అయ్యాయి

నేటి గద్దర్ న్యూస్, వెంకటాపురం :

పాలెం వాగు ప్రాజెక్ట్ ను నమ్ముకొని రైతులు వేసిన వందలాది ఎకరాల వరి పంటలతో పాటు, మిర్చి, మొక్కజొన్న పంటలు కూడా ఎండి పోయాయి అని ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహామూర్తి తెలియజేసారు. శనివారం అయన రైతుల తో పాటు బర్లగూడెం పంచాయతీ లోని వరి పంటలను పరిశీలించుట జరిగింది. పాలెం వాగు ప్రాజెక్ట్ నీళ్లు రాకపోవడం కారణంగానే చేతికొచ్చిన వరి పంటలు ఎండి పోయినట్లు రైతులు నర్సింహా మూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రక్కనే ప్రవహిస్తున్న గోదావరి నదీ జలాలు ఈ ప్రాంత రైతాంగానికి చుక్క నీరు కూడా ఉపయోగపడటం లేదన్నారు. ఈ ప్రాంత గోదావరి జలాలను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఈ ప్రాంత రైతాంగానికి పాలకులు తీవ్ర నష్టం చేస్తున్నారని అయన ఆరోపించారు. ఈ ప్రాంత రైతుల కోసం ఏర్పాటు చేసిన పాలెం వాగు ప్రాజెక్ట్ కూడా నిరూపయోగం గా మారిందన్నారు . సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్ట్ నీళ్లను ఆదా చేయకుండా వేల క్యూ సెక్కుల నీళ్లు గోదావరిలో వృధాగా వదిలేశారని ఆయన ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా యాసంగి లో వేసిన రైతుల పంటలు ఎండి పోయి తీవ్రంగా నష్ట పోయారని తెలిపారు. సంబంధిత ప్రాజెక్ట్ అధికారులు అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి దశాబ్ద కాలం దాటుతున్న ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం పనులు కాలేదని అన్నారు. పదేళ్లు పాలించిన బారాసా పార్టీ ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. అలాగే నూతనంగా ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించు కోకపోవడం అన్యాయం అన్నారు. ఈ ప్రాంత అధికార, ప్రతిపక్ష పార్టీలు పాలెం వాగు ప్రాజెక్ట్ పైన ఎందుకు మాట్లాడడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన యాసంగి పంటలు కళ్ళ ముందే ఎండి పోవడం తో రైతులు కన్నీటి పర్యంతం అయినట్లు ఆయన తెలిపారు. యాసంగి లో వరి పంటలు ఎండిపోయిన రైతులను ప్రజా ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని నర్సింహా మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే యాసంగిలో వరి పంటలు ఎండిపోయిన రైతుల బ్యాంకు రుణాలను కూడా మాఫీ చేయాలనీ ప్రభుత్వాన్ని కోరినారు.ఈ కార్యక్రమం లో రైతులు ఇర్ప బాబు, అట్టం శివ, చేలే బాలకృష్ణ, తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !