+91 95819 05907

పంట ఎండిపోతుంది .పాలకులు ఎక్కడ?

పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు.. కొర్స నర్సింహా మూర్తి

ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్ట్ నీళ్లు వృధా అయ్యాయి

నేటి గద్దర్ న్యూస్, వెంకటాపురం :

పాలెం వాగు ప్రాజెక్ట్ ను నమ్ముకొని రైతులు వేసిన వందలాది ఎకరాల వరి పంటలతో పాటు, మిర్చి, మొక్కజొన్న పంటలు కూడా ఎండి పోయాయి అని ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహామూర్తి తెలియజేసారు. శనివారం అయన రైతుల తో పాటు బర్లగూడెం పంచాయతీ లోని వరి పంటలను పరిశీలించుట జరిగింది. పాలెం వాగు ప్రాజెక్ట్ నీళ్లు రాకపోవడం కారణంగానే చేతికొచ్చిన వరి పంటలు ఎండి పోయినట్లు రైతులు నర్సింహా మూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రక్కనే ప్రవహిస్తున్న గోదావరి నదీ జలాలు ఈ ప్రాంత రైతాంగానికి చుక్క నీరు కూడా ఉపయోగపడటం లేదన్నారు. ఈ ప్రాంత గోదావరి జలాలను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఈ ప్రాంత రైతాంగానికి పాలకులు తీవ్ర నష్టం చేస్తున్నారని అయన ఆరోపించారు. ఈ ప్రాంత రైతుల కోసం ఏర్పాటు చేసిన పాలెం వాగు ప్రాజెక్ట్ కూడా నిరూపయోగం గా మారిందన్నారు . సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్ట్ నీళ్లను ఆదా చేయకుండా వేల క్యూ సెక్కుల నీళ్లు గోదావరిలో వృధాగా వదిలేశారని ఆయన ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా యాసంగి లో వేసిన రైతుల పంటలు ఎండి పోయి తీవ్రంగా నష్ట పోయారని తెలిపారు. సంబంధిత ప్రాజెక్ట్ అధికారులు అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి దశాబ్ద కాలం దాటుతున్న ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం పనులు కాలేదని అన్నారు. పదేళ్లు పాలించిన బారాసా పార్టీ ప్రాజెక్ట్ ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. అలాగే నూతనంగా ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించు కోకపోవడం అన్యాయం అన్నారు. ఈ ప్రాంత అధికార, ప్రతిపక్ష పార్టీలు పాలెం వాగు ప్రాజెక్ట్ పైన ఎందుకు మాట్లాడడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన యాసంగి పంటలు కళ్ళ ముందే ఎండి పోవడం తో రైతులు కన్నీటి పర్యంతం అయినట్లు ఆయన తెలిపారు. యాసంగి లో వరి పంటలు ఎండిపోయిన రైతులను ప్రజా ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని నర్సింహా మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే యాసంగిలో వరి పంటలు ఎండిపోయిన రైతుల బ్యాంకు రుణాలను కూడా మాఫీ చేయాలనీ ప్రభుత్వాన్ని కోరినారు.ఈ కార్యక్రమం లో రైతులు ఇర్ప బాబు, అట్టం శివ, చేలే బాలకృష్ణ, తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !