– రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర డిస్ట్రిక్ట్ గవర్నర్ శంకర్ బూసిరెడ్డి రెడ్డి
నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 22, భద్రాద్రి కొత్తగూడెం(భుర్గంపహాడ్ ):
పిల్లలు శ్రద్దగా చదువుకొని మంచి పౌరులుగా అభివృద్ధి చెంది, సేవా కార్యక్రమాలు చేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర డిస్ట్రిక్ట్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఐటిసి అనుబంధ సేవా సంస్థ అయిన రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర డిస్ట్రిక్ట్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి అధికారిక పర్యటన నిర్వహించారు. ఆయనకు క్లబ్ ప్రెసిడెంట్ జయంత్ కుమార్ దాస్, సెక్రటరీ కె.వి.ఎస్.గోవిందరావు లు పుష్పగుచ్చం అందజేసే ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా సారపాక గ్రామంలోని శ్రీ సత్య సాయి స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం పలు సంస్కృతిక కార్యక్రమాల నిర్వహించారు. తదనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర డిస్ట్రిక్ట్ గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులకు పాదరక్షలు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పిల్లలు శ్రద్దగా చదువుకొని మంచి పౌరులుగా అభివృద్ధి చెంది, సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు. రోటరీ క్లబ్ ఇన్ భద్ర రికార్డులు, క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను తనిఖీ చేశారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.









