+91 95819 05907

కామ్రేడ్ లెనిన్ 154వ జయంతి వేడుకలు

*CPI (ML) 55 ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా CPI (ML) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో మండల పరిధిలోని గుండ్లరేవు గ్రామంలో పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు మల్కం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. పార్టీ మండల కార్యదర్శి బానోతు ధర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో CPI (ML) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి జాటోత్ కృష్ణ మాట్లాడుతూ రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త, రష్యన్ దేశానికి మొదటి కమ్యూనిస్టు అధినేత
చరిత్ర గతిని మార్చి,శ్రమజీవుల రాజ్యం సోషలిజం స్థాపనకై తన జీవితాంతం కృషి చేసిన లెనిన్ పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం అణగారిన ప్రజలు పోరాటాలలో ముందుండాలని జాటోత్ కృష్ణ పిలుపునిచ్చారు. భారతదేశంలో రివిజనిస్టు, నయా రివిజనిస్టు విధానాలకు వ్యతిరేకంగా విప్లవ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 1969 ఏప్రిల్ 22 న లెనిన్ పుట్టినరోజున సిపిఐ ఎంఎల్ పార్టీని దేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మార్క్సిజం లేనినిజం మావో ఆలోచన విధానంతో, నూతన ప్రజాస్వామ్యక విప్లవ విజయవంత లక్ష్యంగా,దోపిడికి గురవుతున్న పీడిత వర్గాలు తమ పోరాటం కొనసాగించాలని ఆయన కోరారు.
నేడు దేశంలో మోడీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ భావజాలంతో బ్రాహ్మణ మనువాదంతో అనగారిన వర్గాలపై దాడులు చేస్తూ దుర్మార్గ కరమైన వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. బిజెపి పాలనలో కార్పొరేట్లకు అనుకూలంగా ప్రధానమంత్రి మోడీ విధానాలు ఉన్నాయని అన్నారు. అదాని అంబానీలకు కొమ్ము కాస్తున్న బిజెపి ఆర్ఎస్ఎస్ కూటమిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని,
మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కృష్ణ కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) డివిజన్ నాయకులు ఏదులాపురం గోపాలరావు, మండల నాయకులు మల్కం వెంకటేశ్వర్లు , నరసింహారావు,తాటి రోహిణి, తెళ్ళం పాపారావు, దొడ్డ ఉదయ్ కుమార్, కోరంపల్లి రమణ, వర్ష సావిత్రి, వరుస సైదా, ఊకే నరసమ్మ, ముక్తి లక్ష్మి, వరుస రామకృష్ణ, దొడ్డ వెన్నెల,ఎట్టి సత్యవతి,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !