+91 95819 05907

Bhurgampahad: కరువు పనిలో గందరగోళం రోజుకు రూ.65..వారానికి రూ 400?!

– రూ.30 కూలీ ఏందంటున్న Egs కూలీలు?!
– మసి పూసి మారేడు కాయ చేసే పనిలో అధికారులు..?
– కొత్త అధికారి తోనే సమస్య మొదలైందా..?

గద్దర్ న్యూస్, ఏప్రిల్ 23, భద్రాద్రి కొత్తగూడెం (ప్రతినిధి) : (✍️ అలవాల వంశీ)

బూర్గంపాడు మండల పరిధిలోని జరుగుతున్న కరువు పనిలో కొందరు అధికారుల పనితనం వల్ల కళ్లిపెళ్లి మొదలవుతుందని విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. రైతువారి పనులు లేని సమయంలో కూలీలకు పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNR EGS) బూర్గంపాడు మండలంలో నవ్వుల పాలు అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉదయాన్నే ఏడు గంటలకు పలుగు, పారా.. భుజాన వేసుకొని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపాధి హామీ పనికి ఆటోకి కిరాయి ఇచ్చుకొని వెళ్లి ఎర్రటి ఎండలో పనిచేస్తే రోజుకు 30 రూపాయలు కూలీ వస్తుందంటే ఉపాధి హామీ పథకం అధికారుల తీరు తేటతెల్లమవుతుంది. మండల పరిధిలోని నాగినేని ప్రోలు పంచాయతీలో ఉపాధి హామీ అధికారుల సొంత తెలివితేటలు కూలీలకు శాపంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 40 రూపాయలు కిరాయి పెట్టుకొని ఉపాధి హామీ పనికి వెళితే.. రోజుకు 30 రూపాయలు కూలీ రావడంతో కూలీలు షాక్ అయ్యారు. వారం రోజులు పనిచేస్తే.. ఆ వారానికి గాను సుమారు 400 రూపాయల కూలీ వచ్చిందంటూ ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత పని చేస్తే ఎంత కూలీ పడుతుంది అని వివరించి పని చేయించాల్సిన అధికారులు.. ఆ విషయం పక్కన పెట్టి, పనికి రాని వారికి కూడా హాజరు వేస్తున్నారు అని పలువురు ఆరోపిస్తున్నారు. పనిచేసిన కూలీలకు 30 రూపాయలు వస్తుంటే, పనిచేయని కూలీలకు హాజరు వేస్తూ పని చేయని వారికి సైతం కూలీ డబ్బులు అందిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పనిచేసిన ఉపాధి హామీ కూలీల కష్టాన్ని కొందరు అధికారులు పనిచేయని వారికి దోచిపెడుతున్నారని వాపోతున్నారు. కూలీలకు కనీస సదుపాయాలు సైతం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్నప్పటికీ పని ప్రదేశంలో కనీసం టెంట్ కూడా వేయడం లేదని కూలీలు మండిపడుతున్నారు. ఎండ తీవ్రతకు ప్రాణం ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ఎండలోనే ఉండాల్సిన దుస్థితి ఉపాధి హామీ కూలీలకు తప్పడం లేదని వాపోతున్నారు. ఎండ తీవ్రతకు కూలీలకు ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ బాధ్యత అధికారులు తీసుకుంటారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బూర్గంపాడు మండలంలో ఇటీవల జరిగిన సామాజిక తనిఖీలో కొందరు అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు ఆడిటర్లు గుర్తించిన విషయం విధితమే. అవకతవకలకు పాల్పడిన వారికి నోటీసులు కూడా అధికారులు అందజేశారు. అది జరిగి నెలలు గడవకముందే మళ్లీ నాగినేని ప్రోలు పంచాయతీలో తెరమీదకు వస్తున్న ఉపాధి హామీ అవకతవకలు విషయంలో ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ నేపద్యంలో ఉపాధి హామీ అవకతవకలపై పూర్తి వివరాలతో నేటి గద్దర్ న్యూస్ వరుస కథనాలు ప్రచురితం చేయనుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టిన భూములకు రక్షణ ఏది ?అన్నవరపు

◆సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య మణుగూరు20: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర పు కనకయ్య

Read More »

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

 Don't Miss this News !