+91 95819 05907

ఎపి పేపర్‌ మిల్లు లాక్‌ఔట్‌ ఎత్తివేత

– దిగివచ్చిన ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం

– నేటి నుంచి యదావిధిగా కార్యకలాపాలు

– జిల్లా కలెక్టర్ చొరవతో ఫలించిన చర్చలు

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26,

ఎపి పేపరు మిల్లు లాకౌట్‌ను ఎత్తివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు గురువారం నోటీసు బోర్డు ఏర్పాటు చేసింది. ఎ షిప్టు నుంచి అనగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా కార్మికులు విధులకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొంది. జిల్లా కలెక్టరు కె. మాధవీలత అధ్యక్షతన జిల్లా ఎస్‌పి, జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సమక్షంలో యాజమాన్యం, మిల్లులోని మొత్తం 11 కార్మిక సంఘాలతో కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం చర్చలు జరిగాయి. సుమారు 2 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘాలు అనేక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. యాజమాన్యంతో జరిపిన చర్చలలో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. కార్మికులు విధులకు హాజరైన 25 రోజులలో వేతన ఒప్పందం చర్చలు చేస్తామని యాజమాన్యం ఒప్పుకుంది. అదే విధంగా ఎపి పేపర్‌ మిల్లు యాజమాన్యం చివరి సారిగా 2017లో కార్మికులతో చేసిన వేతన ఒప్పందం చేసుకోగా ఈ ఒప్పంద కాలం 2020 జూన్‌తో ముగిసింది. గతంలో జరిగిన చర్చలలో 2020`2023 మధ్య కాలానికి వేతన ఒప్పందం చేయబోమంటూ మొండికేసిన యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చింది. జిల్లా కలెక్టర్‌ సమక్షంలో 2020౼2023 కాలానికి రాత పూర్వక హామీ ఇచ్చింది.సమ్మె కాలంలో కార్మికులపై ఎలాంటి కక్ష పూరిత చర్యలు చేపట్టబోమని పేర్కొంది.

ఇది కార్మికుల విజయం: సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి. అరుణ్‌

వేతన ఒప్పందం కోసం కార్మిక సంఘాలు ఐక్యంగా చేసిన పోరాటం ఫలించింది. గత 23 రోజులుగా కార్మికులు ఐక్యంగా సమ్మె చేపట్టారు. ఇది కార్మికుల విజయం. 2020`2023 మధ్య కాలంలోని వేతన ఒప్పందం చేసేందుకు యాజమాన్యం రాతపూర్వక హామి ఇచ్చింది. కార్మికులకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు.
యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కార్మిక పోరాటం తప్పదని పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

పీఎం మోది ముందు చూపు

మోది గారి ముందు చూపు ఎందుకైనా మంచిదని రాజస్థాన్ బార్డర్‌లో 2500 కి.మీ. రేంజ్ కలిగిన ఆగ్ని-2 న్యూక్లియర్ కాపబుల్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ Post Views: 2

Read More »

భూదాన్ నిర్వాసితులను ఇండ్లలోకి పంపే వరకు పోరాటం చేస్తాం*

తుమ్మల , శ్రీనివాస్ రెడ్డి , భట్టి పేదల పక్షమే అంటే మా పోరాటం లో భాగస్వామ్యం కావాలి.* *బీసీ , ఎస్సీ , ఎస్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ విషాదారన్ మహరాజ్* నేటి

Read More »

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు

​మంత్రి తుమ్మల కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు ​యుద్ధ మేఘాల నేపథ్యంలో నాయకుడు క్షేమంగా రావాలని ఆకాంక్ష నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 03: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ

Read More »

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

 Don't Miss this News !