+91 95819 05907

ఎపి పేపర్‌ మిల్లు లాక్‌ఔట్‌ ఎత్తివేత

– దిగివచ్చిన ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం

– నేటి నుంచి యదావిధిగా కార్యకలాపాలు

– జిల్లా కలెక్టర్ చొరవతో ఫలించిన చర్చలు

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26,

ఎపి పేపరు మిల్లు లాకౌట్‌ను ఎత్తివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు గురువారం నోటీసు బోర్డు ఏర్పాటు చేసింది. ఎ షిప్టు నుంచి అనగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా కార్మికులు విధులకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొంది. జిల్లా కలెక్టరు కె. మాధవీలత అధ్యక్షతన జిల్లా ఎస్‌పి, జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సమక్షంలో యాజమాన్యం, మిల్లులోని మొత్తం 11 కార్మిక సంఘాలతో కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం చర్చలు జరిగాయి. సుమారు 2 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘాలు అనేక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. యాజమాన్యంతో జరిపిన చర్చలలో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. కార్మికులు విధులకు హాజరైన 25 రోజులలో వేతన ఒప్పందం చర్చలు చేస్తామని యాజమాన్యం ఒప్పుకుంది. అదే విధంగా ఎపి పేపర్‌ మిల్లు యాజమాన్యం చివరి సారిగా 2017లో కార్మికులతో చేసిన వేతన ఒప్పందం చేసుకోగా ఈ ఒప్పంద కాలం 2020 జూన్‌తో ముగిసింది. గతంలో జరిగిన చర్చలలో 2020`2023 మధ్య కాలానికి వేతన ఒప్పందం చేయబోమంటూ మొండికేసిన యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చింది. జిల్లా కలెక్టర్‌ సమక్షంలో 2020౼2023 కాలానికి రాత పూర్వక హామీ ఇచ్చింది.సమ్మె కాలంలో కార్మికులపై ఎలాంటి కక్ష పూరిత చర్యలు చేపట్టబోమని పేర్కొంది.

ఇది కార్మికుల విజయం: సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి. అరుణ్‌

వేతన ఒప్పందం కోసం కార్మిక సంఘాలు ఐక్యంగా చేసిన పోరాటం ఫలించింది. గత 23 రోజులుగా కార్మికులు ఐక్యంగా సమ్మె చేపట్టారు. ఇది కార్మికుల విజయం. 2020`2023 మధ్య కాలంలోని వేతన ఒప్పందం చేసేందుకు యాజమాన్యం రాతపూర్వక హామి ఇచ్చింది. కార్మికులకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు.
యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కార్మిక పోరాటం తప్పదని పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !