+91 95819 05907

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

– ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
– 10మంది బైండ్ ఓవర్

నేటి గద్దర్ న్యూస్, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం :

బూర్గంపాడు మండల పరిధిలోని గ్రామాలలో గురువారం ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సారపాక గ్రామంలోని ఆటో స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు. వారి వద్ద నుండి సుమారు 30 లీటర్ల గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బూర్గంపాడు పరిసర ప్రాంతాల్లో సుమారు 25 లీటర్ల గుడుంబాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా స్థావరాలలో నాటు సారాను తయారు చేసేందుకు సిద్ధం చేసి ఉంచిన సుమారు 800 లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు గుర్తించి, ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులపై కేసు నమోదు నమోదు చేసినట్లు ఎస్సై అల్లూరి సీతారామరాజు తెలిపారు. పదిమంది వ్యక్తులను బైండోవర్ చేసినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై అల్లూరి సీతారామరాజు మాట్లాడుతూ… గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆయన అన్నారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ఐ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !