+91 95819 05907

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తప్పదు:Cpi ml -mass line

*★చింతలపాడు గ్రామంలోని ఆదివాసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి

*★కరెంటు, మంచినీటి సౌకర్యాలు తక్షణమే కల్పించాలి*

*★పట్టించుకోకపోతే పోరాటం తప్పదు*

*★CPI(ML) మాస్ లైన్ పార్టీ సంయుక్త మండలాల డివిజన్ కార్యదర్శి కొండా చరణ్*

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి(ఎటపాక):
ఎటపాక మండలంలోని పలు గ్రామాలలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సంయుక్త మండలాల డివిజన్ నాయకుల బృందం పర్యటించి ప్రజలను గ్రామాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సంయుక్త మండలాల డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో ఎటపాక మండలంలో పలు గ్రామాలను పర్యటించామని అనేక సమస్యలు తమ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారని అన్నారు అందులో భాగంగానే ఆదివాసి గ్రామమైన చింతలపాడు గ్రామంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు బోర్లు పనిచేయడం లేదని సోలార్లపై ఆధారపడి ఇప్పటివరకు మంచినీటిని వాడుకుంటున్నారని కానీ ఇప్పుడు ఆ సోలార్లు కూడా పనిచేయడం లేదని తద్వారా గ్రామంలోని ప్రజలు మంచినీటి ఎద్దడితో ఎండాకాలం తీవ్రమైన అవస్థలు పడుతున్నారని పిల్లలు పెద్దలు అందరూ దాహానికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దానితోపాటు కరెంటు సౌకర్యం లేదని సోలార్ సిస్టం పనిచేయకపోవడం వల్ల ఈ గ్రామంలో ప్రస్తుతం చీకట్లో మగ్గుతుందని ఇది అటవీ ప్రాంతం కావడం వల్ల ఇక్కడ క్రూర జంతువులు విషపు పాములు క్రిమి కీటకాలు తిరిగి అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు ఇది ఇలాగే కొనసాగితే ఇక్కడి ప్రజలు ఈ చీకట్లో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు ఎన్నిసార్లు ఈ సమస్యని అధికారులకు చెప్పిన ఎన్నిసార్లు చెప్పులురిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగిన ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన అధికారులకు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు అంటున్నారని అన్నారు అధికారులు స్పందించకపోవడం ఈ సమస్యని పరిష్కరించకపోవడం అత్యంత దుర్మార్గమని ఇంత నిర్లక్ష్యంగా ఆదివాసుల ప్రజల పట్ల వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అని అన్నారు ఇప్పటికైనా itda మరియు స్థానిక సంబంధిత అధికారులు స్పందించి ఆరు నెలలుగా పాడైపోయిన చేతిపంపుని బాగు చేయించాలని సోలార్ సిస్టం ని బాగు చేసి మంచినీటి సౌకర్యాన్ని అదేవిధంగా కరెంటు సౌకర్యాన్ని ఈ గ్రామానికి అందించాలని సంబంధిత ఆ అధికారులను అధికారులను డిమాండ్ చేశారు ఈ గ్రామ ప్రజలకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కచ్చితంగా నిరంతరం అండగా ఉంటుందని అన్నారు అధికారులు పట్టించుకోకపోతే కచ్చితంగా పోరాటం నిర్వహిస్తామని తద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ సంయుక్త మండలాల డివిజన్ నాయకులు దాసరి సాయన్న మునిగల శివ, భీమరాజు, శాంతి రాజు, పావని, వీర్రాజు ,సతీష్, కోటేసు, మంగ, శాంతి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

 Don't Miss this News !