+91 95819 05907

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తప్పదు:Cpi ml -mass line

*★చింతలపాడు గ్రామంలోని ఆదివాసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి

*★కరెంటు, మంచినీటి సౌకర్యాలు తక్షణమే కల్పించాలి*

*★పట్టించుకోకపోతే పోరాటం తప్పదు*

*★CPI(ML) మాస్ లైన్ పార్టీ సంయుక్త మండలాల డివిజన్ కార్యదర్శి కొండా చరణ్*

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి(ఎటపాక):
ఎటపాక మండలంలోని పలు గ్రామాలలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సంయుక్త మండలాల డివిజన్ నాయకుల బృందం పర్యటించి ప్రజలను గ్రామాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సంయుక్త మండలాల డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో ఎటపాక మండలంలో పలు గ్రామాలను పర్యటించామని అనేక సమస్యలు తమ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారని అన్నారు అందులో భాగంగానే ఆదివాసి గ్రామమైన చింతలపాడు గ్రామంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు బోర్లు పనిచేయడం లేదని సోలార్లపై ఆధారపడి ఇప్పటివరకు మంచినీటిని వాడుకుంటున్నారని కానీ ఇప్పుడు ఆ సోలార్లు కూడా పనిచేయడం లేదని తద్వారా గ్రామంలోని ప్రజలు మంచినీటి ఎద్దడితో ఎండాకాలం తీవ్రమైన అవస్థలు పడుతున్నారని పిల్లలు పెద్దలు అందరూ దాహానికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దానితోపాటు కరెంటు సౌకర్యం లేదని సోలార్ సిస్టం పనిచేయకపోవడం వల్ల ఈ గ్రామంలో ప్రస్తుతం చీకట్లో మగ్గుతుందని ఇది అటవీ ప్రాంతం కావడం వల్ల ఇక్కడ క్రూర జంతువులు విషపు పాములు క్రిమి కీటకాలు తిరిగి అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు ఇది ఇలాగే కొనసాగితే ఇక్కడి ప్రజలు ఈ చీకట్లో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు ఎన్నిసార్లు ఈ సమస్యని అధికారులకు చెప్పిన ఎన్నిసార్లు చెప్పులురిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగిన ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన అధికారులకు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు అంటున్నారని అన్నారు అధికారులు స్పందించకపోవడం ఈ సమస్యని పరిష్కరించకపోవడం అత్యంత దుర్మార్గమని ఇంత నిర్లక్ష్యంగా ఆదివాసుల ప్రజల పట్ల వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అని అన్నారు ఇప్పటికైనా itda మరియు స్థానిక సంబంధిత అధికారులు స్పందించి ఆరు నెలలుగా పాడైపోయిన చేతిపంపుని బాగు చేయించాలని సోలార్ సిస్టం ని బాగు చేసి మంచినీటి సౌకర్యాన్ని అదేవిధంగా కరెంటు సౌకర్యాన్ని ఈ గ్రామానికి అందించాలని సంబంధిత ఆ అధికారులను అధికారులను డిమాండ్ చేశారు ఈ గ్రామ ప్రజలకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కచ్చితంగా నిరంతరం అండగా ఉంటుందని అన్నారు అధికారులు పట్టించుకోకపోతే కచ్చితంగా పోరాటం నిర్వహిస్తామని తద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ సంయుక్త మండలాల డివిజన్ నాయకులు దాసరి సాయన్న మునిగల శివ, భీమరాజు, శాంతి రాజు, పావని, వీర్రాజు ,సతీష్, కోటేసు, మంగ, శాంతి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !