+91 95819 05907

భద్రాచలం నియోజకవర్గంలో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం…

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేసిన విధంగానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తుంది..
భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు

మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండా నే..
అభివృద్ధి కోసం పరితపించే పోరిక బలరాం నాయక్ ని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు.

మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగల శ్రీనివాస్ రెడ్డి

నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ మాజీ గ్రంథాల చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ *తెల్లం వెంకట్రావు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచల శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, ప్రజలతో మమేకమై మాట్లాడుతూ…..

గత పదిలుగా భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి కొంటుపడిందని, మళ్లీ ఇంకో ఐదు ఏళ్ళు అభివృద్ధిలో వెనక్కి పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీతోనే భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలోచించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పోరిక బలరాం నాయక్ నీ కూడా అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి విచ్చే విధంగా ప్రజలు దీవించాలని.

భద్రాచల నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి బలరాం నాయక్ ని గెలిపించుకోవడం ద్వారా, ఎమ్మెల్యే నిధులు,ఎంపీ నిధులు తెచ్చుకుని భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం ఉందని.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా,మల్లు బట్టి విక్రమార్క రెవిన్యూ శాఖ మంత్రివర్యులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ప్రాతినిధ్యం వహిస్తున్నందున, వారి ముగ్గురు సహకారంతో భద్రాచలం నియోజకవర్గని వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఎన్నికల అయన ప్రచారంలో ప్రజలకు వివరించారు.

దక్షిణాయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కానీ, పదియేలు తెలంగాణను పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ అభివృద్ధి పై ఆలోచన లేకుండా భద్రాచల రామాలయాన్ని విస్మరించారని..

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భద్రాచల అభివృద్ధికి కట్టుబడి ఉందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి భద్రాచలాన్ని అభివృద్ధి చేసి తీరుతుందని.

పోరిక బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం ద్వారా, తిరుమల తిరుపతి , యాదాద్రి తరహాలో గొప్ప ఆధ్యాత్మిక దేవాలయం లాగా రామాలయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన ప్రజలకు వివరించారు.

ఎన్నికల ప్రచారంలో…..
టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బలుసు నాగ సతీష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్,రాగం సుధాకర్, ఆలీ పాషా, నర్రా రాము,దుద్దుకూరు సాయిబాబా, గండేపల్లి హనుమంతరావు, ఎండి నవాబ్, అన్నేం రామిరెడ్డి,అన్నేం వెంకటేశ్వర రెడ్డి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి,తుమ్మల రాణి,ఒంగోలు దేవకి, కట్టా కళ్యాణి, పద్మప్రియ, రూపా దేవి ,కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు అధ్యక్షులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !