+91 95819 05907

ఘనంగా మేడే వేడుకలు

*సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు*
*మే డే సభలో సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు*
నేటి గద్దర్ కరకగూడెం: కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు అనగారిన శ్రామిక వర్గం పక్షాన నికరంగా పోరాటం నిర్వహించేది ఎర్రజెండా మాత్రమేనని సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు పేర్కొన్నారు. మే డే సందర్భంగా మండలంలోనీ పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేసి సభలు సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రజెండా ఆవిర్భావమే అమరవీరుల రక్తతర్పణతో జరిగిందని హక్కుల కోసం జరిగిన పోరాటంలో త్యాగానికి సమస్యల పోరాటాలకు మేడే సజీవ సాక్ష్యం అని పేర్కొన్నారు పాలక పార్టీలు ఓట్లు సీట్లు కోసం తప్ప సమాజ మార్పు కోసం పనిచేయడం లేదని దోపిడీ నిర్మూలన సమానత్వం ఎర్రజెండా రాజ్యంలోనే సాధ్యమని పేర్కొన్నారు కమ్యూనిస్టులు సిపిఎం బలంగా ఉన్ననాడు దేశవ్యాప్తంగా ప్రజా అనుకూల చట్టాలు తయారు చేయబడ్డాయని అటువంటి చట్టాలకి నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో అసమానతలు లేని ప్రగతిని సాధించాలంటే సిపిఎం చెబుతున్న ఆర్థిక విధానాల అమలు తప్ప మరొక మార్గం లేదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పేరుతో పేదలకు ఇచ్చేటువంటి రాయితీలను సైతం ప్రభుత్వాలు రోజురోజుకీ రద్దు చేస్తున్నాయని విమర్శించారు కులం మతం ప్రాంతీయ అసమానతలు ఆర్థిక అసమానతలు లేని మంచి సమాజం కోసం విద్యా ఉపాధి మెరుగైన వైద్యం పంటలకు గిట్టుబాటు ధరలు కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు కనీస వేతనాలు అమలు చేయగలిగే సిద్ధాంతం నిబద్ధత కలిగింది సిపిఎం పార్టీ మాత్రమేనని అన్నారు. నేడు రాజకీయాల్లో డబ్బు మతం కులం విచ్చనక అంశాలను ఉపయోగించి బూర్జువా పార్టీలు అధికారాన్ని అనుభవిస్తున్నాయని వారికి అధికారం అనేటువంటిది కొద్ది మంది సంపన్నులకు దేశ సంపద దోచి పెట్టడానికి ఉపయోగపడుతుందని సిపిఎం పేర్కొన్నది సిపిఎం పార్టీని కార్మిక ప్రజా పోరాటాలను బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వివిధ గ్రామాల్లో జరిగిన మేడే జెండా ఆవిష్కరణలు పార్టీ మండల కమిటీ సభ్యులు , సర్ప సత్యం బిలపాటి శంకరయ్య కనితి రాము అడమయ్య సిఐటియు నాయకులు ఇల్లందుల పిచ్చయ్య గాంధర్ల ధనంజయ్ ఉప్పల సాంబశివరావు ప్రశాంత్ సాంబశివరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై..ఆశీర్వదించిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు.మడుపల్లి భాస్కర్.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, ఈరోజు ఖమ్మం పట్టణంలోని R R R. ఫంక్షన్ హాల్ నందు …చింతకాని చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ *దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మేనకోడలు వేమూరి

Read More »

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ, నిరసన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన

Read More »

చలో వరంగల్, సైకిల్ పై ప్రచార యాత్ర నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: ఈనెల 27 న వరంగల్ లో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ, ను జయప్రదం చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించిన భద్రాద్రి

Read More »

ఈనెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది

. గజ్వేల్ మండల్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి చిట్యాల ఎల్లం. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 24. వరంగల్ లో ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే రజోత్సవ

Read More »

 Don't Miss this News !