+91 95819 05907

ఘనంగా మేడే వేడుకలు

*సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు*
*మే డే సభలో సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు*
నేటి గద్దర్ కరకగూడెం: కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు అనగారిన శ్రామిక వర్గం పక్షాన నికరంగా పోరాటం నిర్వహించేది ఎర్రజెండా మాత్రమేనని సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు పేర్కొన్నారు. మే డే సందర్భంగా మండలంలోనీ పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేసి సభలు సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రజెండా ఆవిర్భావమే అమరవీరుల రక్తతర్పణతో జరిగిందని హక్కుల కోసం జరిగిన పోరాటంలో త్యాగానికి సమస్యల పోరాటాలకు మేడే సజీవ సాక్ష్యం అని పేర్కొన్నారు పాలక పార్టీలు ఓట్లు సీట్లు కోసం తప్ప సమాజ మార్పు కోసం పనిచేయడం లేదని దోపిడీ నిర్మూలన సమానత్వం ఎర్రజెండా రాజ్యంలోనే సాధ్యమని పేర్కొన్నారు కమ్యూనిస్టులు సిపిఎం బలంగా ఉన్ననాడు దేశవ్యాప్తంగా ప్రజా అనుకూల చట్టాలు తయారు చేయబడ్డాయని అటువంటి చట్టాలకి నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో అసమానతలు లేని ప్రగతిని సాధించాలంటే సిపిఎం చెబుతున్న ఆర్థిక విధానాల అమలు తప్ప మరొక మార్గం లేదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పేరుతో పేదలకు ఇచ్చేటువంటి రాయితీలను సైతం ప్రభుత్వాలు రోజురోజుకీ రద్దు చేస్తున్నాయని విమర్శించారు కులం మతం ప్రాంతీయ అసమానతలు ఆర్థిక అసమానతలు లేని మంచి సమాజం కోసం విద్యా ఉపాధి మెరుగైన వైద్యం పంటలకు గిట్టుబాటు ధరలు కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు కనీస వేతనాలు అమలు చేయగలిగే సిద్ధాంతం నిబద్ధత కలిగింది సిపిఎం పార్టీ మాత్రమేనని అన్నారు. నేడు రాజకీయాల్లో డబ్బు మతం కులం విచ్చనక అంశాలను ఉపయోగించి బూర్జువా పార్టీలు అధికారాన్ని అనుభవిస్తున్నాయని వారికి అధికారం అనేటువంటిది కొద్ది మంది సంపన్నులకు దేశ సంపద దోచి పెట్టడానికి ఉపయోగపడుతుందని సిపిఎం పేర్కొన్నది సిపిఎం పార్టీని కార్మిక ప్రజా పోరాటాలను బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వివిధ గ్రామాల్లో జరిగిన మేడే జెండా ఆవిష్కరణలు పార్టీ మండల కమిటీ సభ్యులు , సర్ప సత్యం బిలపాటి శంకరయ్య కనితి రాము అడమయ్య సిఐటియు నాయకులు ఇల్లందుల పిచ్చయ్య గాంధర్ల ధనంజయ్ ఉప్పల సాంబశివరావు ప్రశాంత్ సాంబశివరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !