+91 95819 05907

యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని హృదయంలో భద్రపరచుకున్న వ్యక్తి కెసిఆర్

మాజీ సీఎం KCR ని మర్యాద పూర్వకంగా కలిసిన కూనవరం మాజీ సర్పంచ్, ఎంపీటీసీ
★ సోషల్ మీడియాలో దొర దొర అంటూ అసత్య ప్రచారం చేశారు
★ కెసిఆర్ సార్ మృదుస్వభావి
★ KCR ని కలవడం మా పూర్వజన్మ సుకృతం
★ ఈ అవకాశం కల్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS అధ్యక్షులు రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు
★నేటి గద్ధర్ న్యూస్ తో సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు, కూనవరం మాజీ ఎంపీటీసీ ఏనిక ప్రసాద్ ,మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ

నేటి గద్ధర్ న్యూస్, పినపాక నియోజకవర్గ ప్రతినిధి: తెలంగాణ మహాత్ముడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు శ్రామికుని వలె నిరంతరం కష్టపడిన ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,BRS పార్టీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్రాన్ని తన గుండెలో భద్రపరచుకున్న గొప్ప వ్యక్తి కేసిఆర్ ను బుధవారం కొత్తగూడెంలో మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, మండల సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షులు ఏనిక ప్రసాద్, మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ లు కొత్తగూడెం సింగరేణి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు నేటి గద్దర్ న్యూస్ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అతి ఇంచు అభివృద్ధి చెందాలని తపన, సాధించిన ఫలాలు తెలంగాణ ప్రజలకి దక్కాలని ఆకాంక్ష కెసిఆర్ లో స్పష్టంగా దగ్గరుండి గమనించడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో ఒక వర్గం పని కట్టుకొని స్వార్థపూరితంగా దొర అని … కెసిఆర్ దొరల పాలన చేస్తున్నాడని విష ప్రచారం చేసి యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తప్పు దోవ పట్టించారని ఆవేదన వెలుబుచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మృదుస్వభావి అని ఈ అంశాన్ని దగ్గరుండి గమనించడం జరిగిందన్నారు. అంత గొప్ప వ్యక్తిని తెలంగాణ ప్రజానీకం దూరం చేసుకుని కొన్ని నెలలకే కష్టాల పాలయ్యారని ఆవేదన వెలుబుచ్చారు. ప్రతిక్షణం కెసిఆర్ సార్ తెలంగాణ అభివృద్ధి కొరకే తపిస్తున్నారని వారు తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతి కార్యకర్త ,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, సోషల్ మీడియా సభ్యులు కృషి చేయాలని సూచించినట్లు వారు తెలిపారు. తెలంగాణ మహాత్మ కేసిఆర్ ని కలిసే భాగ్యం కల్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !