+91 95819 05907

Adilabad:పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.

— కేంద్ర ఎన్నికల డిప్యూటి కమిషనర్ నితేష్ కుమార్.
నేటి గద్ధర్ న్యూస్ ,అదిలాబాద్(మే2) బ్యూరో : ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి తెలంగాణ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు.సందర్బంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారాలను ఆదేశించారు.ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పట్లు పూర్తి చేయాలనీ సూచించారు.జిల్లాల వారిగా ఎన్నికల ఏర్పాట్ల వివరాలపై సమీక్షించారు.ఈవీఎం ల ర్యాండమైజేషన్ ఓటరు గుర్తింపు పత్రాల పంపిణీ పోలింగ్ కేంద్రాల్లో మౌళిక సదుపాయాల కల్పన వెబ్ కాస్టింగ్ సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు, పోలీసు బందోబస్తు తదితర అంశాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ రెండు గంటలకు తప్పకుండా ఖచ్చితమైన పోలింగ్ శాతపు వివరాలు పంపాలని తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేయాలన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.ఓటింగ్ శాతం పెంచేందుకు విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి నిర్మల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల సిబ్బందికి రెండో విడత అవగాహనా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో పోలీసు శాఖ వారి సమన్వయంతో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని వివరించారు.అనంతరం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిళ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నర్వహణకు పటిష్ఠ బద్రతను కల్పిస్తున్నామని అన్నారు. 48 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని అదనపు పోలీస్ బద్రతను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ డీఆర్వో భుజంగ్ రావ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !