+91 95819 05907

Adilabad:ఆ 75 మంది ఉద్యోగుల కు షో కాజ్ నోటీసులు

*రెండవ విడత ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన 75 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు*

అదిలాబాద్ బ్యూరో:
రెండవ విడత ఎన్నికల శిక్షణలో భాగంగా ఇప్పటివరకు పీ ఓ, ఏ పీ ఓ లకు జరిగిన రెండు రోజుల శిక్షణకు మొత్తం 75 మంది ఉద్యోగులు గైరాజరైనందున, వారికి ఆర్ డి ఓ, సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారుల ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
రెండవ విడత శిక్షణలో భాగంగా మే 1 న పి ఓ, ఏ పి ఓ లకు ముధోల్ నియోజకవర్గం లో ఐఐఐటీ బాసర లో జరిగిన శిక్షణ కార్యక్రమానికి 25 మంది, నిర్మల్ నియోజకవర్గం లో సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో జరిగిన శిక్షణా కార్యక్రమానికి ఇద్దరు, ఖానాపూర్ నియోజకవర్గం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన శిక్షణా కార్యక్రమానికి 7 గురు చొప్పున మొత్తం 34 మంది గైరాజరైనారని, అదేవిధంగా మే రెండవ తేదీనాడు పీ ఓ, ఏ పీ ఓ లకు జరిగిన శిక్షణ కార్యక్రమాలకు ముధోల్ నియోజకవర్గం లో 26 మంది, నిర్మల్ నియోజకవర్గంలో 8 మంది, ఖానాపూర్ నియోజకవర్గం లో 7గురు చొప్పున మొత్తం 41 మంది గైరాజరైనారని ఆయన తెలియజేశారు. షోకాజ్ నోటీసులు జారీ అయిన మొత్తం 75 మంది, ఇవ్వబడిన నోటీసులకు రేపు సరైన వివరణ ఇవ్వాలని, అదేవిధంగా రేపు జరిగే ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి ఆయా నియోజక వర్గాల పరిధిలో వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో తప్పకుండా శిక్షణకు హాజరుకావాలని, లేనియెడల ఎన్నికల నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

 Don't Miss this News !