+91 95819 05907

హత్యకేసులో ఆరుగురు నిందితులకి జైలు శిక్ష

నేటి గద్ధర్ న్యూస్,అదిలాబాద్ బ్యూరో:
వాంకిడి మండలం ఖిర్డి గ్రామంలో భూ తగాదాల విషయంలో జంట హత్యలు చేసిన కేసులో ఆరుగురు నిందితులకి జీవిత ఖైదు మరియు 15 వేల చొప్పున మొత్తం 90000 జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ గారు తీర్పు ఇచ్చారు. వాంకిడి సీఐ శ్రీనివాస్ గారు తెలిపిన వివరాల ప్రకారం
తేది 21.06.2019 రోజున మద్యాహ్నం అందాజ 1200 గంటల సమయమున పాత భూతగాదాలను దృష్టి లో పెట్టుకొని నేరస్తులు అయిన 1). తోడాసం బోజ్జిరావు, 2). సేడ్మకే గంగారం, , 3). సేడ్మకే తెలంగ్ రావు 4). సేడ్మకే ఎశ్వంత్ రావు, 5). సేడ్మకే జంగు మరియు 6). తోడసం శారద, అను ఆరుగురు కలిసి ఒక పథకం ప్రకారము మారణ ఆయుధాలు (గొడ్డళ్ళు) చేతులలో పట్టుకొని, ఖిరిడి గ్రామ శివారులోని (మృతుడు) 1.రాయి సిడం శ్యాంరావు, తం: గంగు, వయస్సు: 52 సం.లు, కులం: గోండు, వ్రుత్తి: వ్యవసాయము, నివాసము: ఖిరిడి గ్రామము, మండలం: వాంకిడి యొక్క వ్యవసాయ భూమిలోకి వెళ్లి, అతన్ని మరియు అతని భార్య అయిన (మృతురాలు) 2).రాయి సిడం తారాబాయి w/o. శ్యాంరావు, వయస్సు: 45 సం.లు, కులం: గోండు, వ్రుత్తి: వ్యవసాయము, నివాసము: ఖిరిడి గ్రామము, మండలం: వాంకిడి అనువారిని నిర్దాక్షిణ్యంగా గొడ్డళ్ళతో నరికి హత్య చేసినారు.
ఇట్టి విషయం పై మృతుల కుమారుడు అయిన రాయి సిడం విలాస్, పిర్యాదు ఇవ్వగా, వాంకిడి పోలిస్ స్టేషన్ నందు కేసు నం. 88/2019, U/Sec. 147, 148, 302 r/w 149 IPC గా నమోదు అయినాడు. ఇట్టి కేసులో అప్పటి వాంకిడి CI గారైన శ్రీ. రాణా ప్రతాప్ గారు విచారణ చేసి, ఆరుగురు నేరస్తులను రిమాండుకు తరలించినారు మరియు విచారణ పూర్తి అయిన తరువాత వారిపై గౌరవ న్యాయస్థానం లో చార్జ్ షీటు సమర్పించినారు. ప్రస్తుత వాంకిడి CI గారైన B. శ్రీనివాస్ గారు సాక్షులను, ముద్దాయిలను కోర్టు ముందు హాజరు పరచగా పిపి GVS ప్రసాద్ & జగన్మోహన్రావు గారు సాక్షులను విచారణ చేయగా నిందితులు నేరం చేసినట్టు రుజువైనది. కేసులోని నేరస్తులైన ఆరుగురి పైన నేరము రుజువు అయినందున గౌరవ జిల్లా సెషన్ జడ్జి గారు జీవిత ఖైదు మరియు 15 వేల చొప్పున మొత్తం 90 వేల రూపాయలను జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినారు.
కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత అసిఫాబాద్ డిఎస్పి సదయ్య , వాంకిడి సిఐ డి శ్రీనివాస్, ఎస్సై సాగర్ , కోర్టు అసిఫాబాద్ డివిజన్ లైజనింగ్ ఆఫీసర్ రామ్ సింగ్, పోషెట్టి మరియు కోర్ట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ గారు అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !