+91 95819 05907

హత్యకేసులో ఆరుగురు నిందితులకి జైలు శిక్ష

నేటి గద్ధర్ న్యూస్,అదిలాబాద్ బ్యూరో:
వాంకిడి మండలం ఖిర్డి గ్రామంలో భూ తగాదాల విషయంలో జంట హత్యలు చేసిన కేసులో ఆరుగురు నిందితులకి జీవిత ఖైదు మరియు 15 వేల చొప్పున మొత్తం 90000 జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ గారు తీర్పు ఇచ్చారు. వాంకిడి సీఐ శ్రీనివాస్ గారు తెలిపిన వివరాల ప్రకారం
తేది 21.06.2019 రోజున మద్యాహ్నం అందాజ 1200 గంటల సమయమున పాత భూతగాదాలను దృష్టి లో పెట్టుకొని నేరస్తులు అయిన 1). తోడాసం బోజ్జిరావు, 2). సేడ్మకే గంగారం, , 3). సేడ్మకే తెలంగ్ రావు 4). సేడ్మకే ఎశ్వంత్ రావు, 5). సేడ్మకే జంగు మరియు 6). తోడసం శారద, అను ఆరుగురు కలిసి ఒక పథకం ప్రకారము మారణ ఆయుధాలు (గొడ్డళ్ళు) చేతులలో పట్టుకొని, ఖిరిడి గ్రామ శివారులోని (మృతుడు) 1.రాయి సిడం శ్యాంరావు, తం: గంగు, వయస్సు: 52 సం.లు, కులం: గోండు, వ్రుత్తి: వ్యవసాయము, నివాసము: ఖిరిడి గ్రామము, మండలం: వాంకిడి యొక్క వ్యవసాయ భూమిలోకి వెళ్లి, అతన్ని మరియు అతని భార్య అయిన (మృతురాలు) 2).రాయి సిడం తారాబాయి w/o. శ్యాంరావు, వయస్సు: 45 సం.లు, కులం: గోండు, వ్రుత్తి: వ్యవసాయము, నివాసము: ఖిరిడి గ్రామము, మండలం: వాంకిడి అనువారిని నిర్దాక్షిణ్యంగా గొడ్డళ్ళతో నరికి హత్య చేసినారు.
ఇట్టి విషయం పై మృతుల కుమారుడు అయిన రాయి సిడం విలాస్, పిర్యాదు ఇవ్వగా, వాంకిడి పోలిస్ స్టేషన్ నందు కేసు నం. 88/2019, U/Sec. 147, 148, 302 r/w 149 IPC గా నమోదు అయినాడు. ఇట్టి కేసులో అప్పటి వాంకిడి CI గారైన శ్రీ. రాణా ప్రతాప్ గారు విచారణ చేసి, ఆరుగురు నేరస్తులను రిమాండుకు తరలించినారు మరియు విచారణ పూర్తి అయిన తరువాత వారిపై గౌరవ న్యాయస్థానం లో చార్జ్ షీటు సమర్పించినారు. ప్రస్తుత వాంకిడి CI గారైన B. శ్రీనివాస్ గారు సాక్షులను, ముద్దాయిలను కోర్టు ముందు హాజరు పరచగా పిపి GVS ప్రసాద్ & జగన్మోహన్రావు గారు సాక్షులను విచారణ చేయగా నిందితులు నేరం చేసినట్టు రుజువైనది. కేసులోని నేరస్తులైన ఆరుగురి పైన నేరము రుజువు అయినందున గౌరవ జిల్లా సెషన్ జడ్జి గారు జీవిత ఖైదు మరియు 15 వేల చొప్పున మొత్తం 90 వేల రూపాయలను జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినారు.
కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత అసిఫాబాద్ డిఎస్పి సదయ్య , వాంకిడి సిఐ డి శ్రీనివాస్, ఎస్సై సాగర్ , కోర్టు అసిఫాబాద్ డివిజన్ లైజనింగ్ ఆఫీసర్ రామ్ సింగ్, పోషెట్టి మరియు కోర్ట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ గారు అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !