+91 95819 05907

హత్యకేసులో ఆరుగురు నిందితులకి జైలు శిక్ష

నేటి గద్ధర్ న్యూస్,అదిలాబాద్ బ్యూరో:
వాంకిడి మండలం ఖిర్డి గ్రామంలో భూ తగాదాల విషయంలో జంట హత్యలు చేసిన కేసులో ఆరుగురు నిందితులకి జీవిత ఖైదు మరియు 15 వేల చొప్పున మొత్తం 90000 జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ గారు తీర్పు ఇచ్చారు. వాంకిడి సీఐ శ్రీనివాస్ గారు తెలిపిన వివరాల ప్రకారం
తేది 21.06.2019 రోజున మద్యాహ్నం అందాజ 1200 గంటల సమయమున పాత భూతగాదాలను దృష్టి లో పెట్టుకొని నేరస్తులు అయిన 1). తోడాసం బోజ్జిరావు, 2). సేడ్మకే గంగారం, , 3). సేడ్మకే తెలంగ్ రావు 4). సేడ్మకే ఎశ్వంత్ రావు, 5). సేడ్మకే జంగు మరియు 6). తోడసం శారద, అను ఆరుగురు కలిసి ఒక పథకం ప్రకారము మారణ ఆయుధాలు (గొడ్డళ్ళు) చేతులలో పట్టుకొని, ఖిరిడి గ్రామ శివారులోని (మృతుడు) 1.రాయి సిడం శ్యాంరావు, తం: గంగు, వయస్సు: 52 సం.లు, కులం: గోండు, వ్రుత్తి: వ్యవసాయము, నివాసము: ఖిరిడి గ్రామము, మండలం: వాంకిడి యొక్క వ్యవసాయ భూమిలోకి వెళ్లి, అతన్ని మరియు అతని భార్య అయిన (మృతురాలు) 2).రాయి సిడం తారాబాయి w/o. శ్యాంరావు, వయస్సు: 45 సం.లు, కులం: గోండు, వ్రుత్తి: వ్యవసాయము, నివాసము: ఖిరిడి గ్రామము, మండలం: వాంకిడి అనువారిని నిర్దాక్షిణ్యంగా గొడ్డళ్ళతో నరికి హత్య చేసినారు.
ఇట్టి విషయం పై మృతుల కుమారుడు అయిన రాయి సిడం విలాస్, పిర్యాదు ఇవ్వగా, వాంకిడి పోలిస్ స్టేషన్ నందు కేసు నం. 88/2019, U/Sec. 147, 148, 302 r/w 149 IPC గా నమోదు అయినాడు. ఇట్టి కేసులో అప్పటి వాంకిడి CI గారైన శ్రీ. రాణా ప్రతాప్ గారు విచారణ చేసి, ఆరుగురు నేరస్తులను రిమాండుకు తరలించినారు మరియు విచారణ పూర్తి అయిన తరువాత వారిపై గౌరవ న్యాయస్థానం లో చార్జ్ షీటు సమర్పించినారు. ప్రస్తుత వాంకిడి CI గారైన B. శ్రీనివాస్ గారు సాక్షులను, ముద్దాయిలను కోర్టు ముందు హాజరు పరచగా పిపి GVS ప్రసాద్ & జగన్మోహన్రావు గారు సాక్షులను విచారణ చేయగా నిందితులు నేరం చేసినట్టు రుజువైనది. కేసులోని నేరస్తులైన ఆరుగురి పైన నేరము రుజువు అయినందున గౌరవ జిల్లా సెషన్ జడ్జి గారు జీవిత ఖైదు మరియు 15 వేల చొప్పున మొత్తం 90 వేల రూపాయలను జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినారు.
కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత అసిఫాబాద్ డిఎస్పి సదయ్య , వాంకిడి సిఐ డి శ్రీనివాస్, ఎస్సై సాగర్ , కోర్టు అసిఫాబాద్ డివిజన్ లైజనింగ్ ఆఫీసర్ రామ్ సింగ్, పోషెట్టి మరియు కోర్ట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ గారు అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

 Don't Miss this News !