+91 95819 05907

హత్యకేసులో ఆరుగురు నిందితులకి జైలు శిక్ష

నేటి గద్ధర్ న్యూస్,అదిలాబాద్ బ్యూరో:
వాంకిడి మండలం ఖిర్డి గ్రామంలో భూ తగాదాల విషయంలో జంట హత్యలు చేసిన కేసులో ఆరుగురు నిందితులకి జీవిత ఖైదు మరియు 15 వేల చొప్పున మొత్తం 90000 జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ గారు తీర్పు ఇచ్చారు. వాంకిడి సీఐ శ్రీనివాస్ గారు తెలిపిన వివరాల ప్రకారం
తేది 21.06.2019 రోజున మద్యాహ్నం అందాజ 1200 గంటల సమయమున పాత భూతగాదాలను దృష్టి లో పెట్టుకొని నేరస్తులు అయిన 1). తోడాసం బోజ్జిరావు, 2). సేడ్మకే గంగారం, , 3). సేడ్మకే తెలంగ్ రావు 4). సేడ్మకే ఎశ్వంత్ రావు, 5). సేడ్మకే జంగు మరియు 6). తోడసం శారద, అను ఆరుగురు కలిసి ఒక పథకం ప్రకారము మారణ ఆయుధాలు (గొడ్డళ్ళు) చేతులలో పట్టుకొని, ఖిరిడి గ్రామ శివారులోని (మృతుడు) 1.రాయి సిడం శ్యాంరావు, తం: గంగు, వయస్సు: 52 సం.లు, కులం: గోండు, వ్రుత్తి: వ్యవసాయము, నివాసము: ఖిరిడి గ్రామము, మండలం: వాంకిడి యొక్క వ్యవసాయ భూమిలోకి వెళ్లి, అతన్ని మరియు అతని భార్య అయిన (మృతురాలు) 2).రాయి సిడం తారాబాయి w/o. శ్యాంరావు, వయస్సు: 45 సం.లు, కులం: గోండు, వ్రుత్తి: వ్యవసాయము, నివాసము: ఖిరిడి గ్రామము, మండలం: వాంకిడి అనువారిని నిర్దాక్షిణ్యంగా గొడ్డళ్ళతో నరికి హత్య చేసినారు.
ఇట్టి విషయం పై మృతుల కుమారుడు అయిన రాయి సిడం విలాస్, పిర్యాదు ఇవ్వగా, వాంకిడి పోలిస్ స్టేషన్ నందు కేసు నం. 88/2019, U/Sec. 147, 148, 302 r/w 149 IPC గా నమోదు అయినాడు. ఇట్టి కేసులో అప్పటి వాంకిడి CI గారైన శ్రీ. రాణా ప్రతాప్ గారు విచారణ చేసి, ఆరుగురు నేరస్తులను రిమాండుకు తరలించినారు మరియు విచారణ పూర్తి అయిన తరువాత వారిపై గౌరవ న్యాయస్థానం లో చార్జ్ షీటు సమర్పించినారు. ప్రస్తుత వాంకిడి CI గారైన B. శ్రీనివాస్ గారు సాక్షులను, ముద్దాయిలను కోర్టు ముందు హాజరు పరచగా పిపి GVS ప్రసాద్ & జగన్మోహన్రావు గారు సాక్షులను విచారణ చేయగా నిందితులు నేరం చేసినట్టు రుజువైనది. కేసులోని నేరస్తులైన ఆరుగురి పైన నేరము రుజువు అయినందున గౌరవ జిల్లా సెషన్ జడ్జి గారు జీవిత ఖైదు మరియు 15 వేల చొప్పున మొత్తం 90 వేల రూపాయలను జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినారు.
కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత అసిఫాబాద్ డిఎస్పి సదయ్య , వాంకిడి సిఐ డి శ్రీనివాస్, ఎస్సై సాగర్ , కోర్టు అసిఫాబాద్ డివిజన్ లైజనింగ్ ఆఫీసర్ రామ్ సింగ్, పోషెట్టి మరియు కోర్ట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ గారు అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !