+91 95819 05907

ఆ బెల్టుషాపు ఓనర్ లు తహశీల్దార్ నే ఫోటోలు తీయబోయ్యారా?. ఆ తర్వాత ఎం జరిగింది అంటే?

నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఆయన ఓ మండల మెజిస్ట్రేట్. అన్యాక్రాంతమైన భూమిని కాపాడడానికి తన విధి నిర్వహణలో భాగంగా అక్రమంగా ఉంటున్న భూ యజమానులకు నోటీసు ఇవ్వబోయాడు. సదర్ భూ యజమాని ఓ తహశీల్దార్ నే ఫోటోలు తీసి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తహశీల్దార్ ను భయభ్రాంతులకు గురి చేశాడు. తహశీల్దార్ నాగ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరకగూడెం మండలం భట్టుపల్లి పంచాయతీ వీరాపురం క్రాస్ రోడ్డు వద్ద Survey No:9 ప్రభుత్వ భూమి లో కొంతమంది వ్యక్తులు నివాసం ఏర్పాటు చేసుకుని బెల్ట్ షాపులు ,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఇదే బెల్ట్ షాప్ ల కి గతంలో కరకగూడెం తహసిల్దార్ పాలూరి నాగ ప్రసాద్ రైతు వేషం లో వెళ్లి తనిఖీలు నిర్వహించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కస్తూరిబా పాఠశాల దగ్గరగా ఆ బెల్ట్ షాపు ఉండడమే ఇందుకు కారణమని తహశీల్దార్ అప్పట్లో తెలిపారు. అయినప్పటికిని నేటికి బెల్ట్ షాపు నిర్వాహకులు ఏలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే తహసిల్దార్ నాగప్రసాద్ తన సిబ్బందితో శుక్రవారం మరో మారు ఆ షాపులను తనిఖీ చేయడానికి , అలాగే నోటీసులు జారీ చేయడానికి వెళ్లడం జరిగింది. దీనితో కోపాద్రిక్తులైన ఆ షాపు యజమానులు తహసీల్దార్ ను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఫోటోలు సైతం తీశారని తెలియవచ్చింది. ఓ మండల తహశీల్దార్ పై సంబంధిత షాప్ నిర్వాహకులు ప్రవర్తించిన తీరును మండల ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.

*తహసిల్దార్ నాగప్రసాద్ వివరణ*
కరకగూడెం తాసిల్దార్ నాగప్రసాద్ ని నేటి గద్దర్ న్యూస్ వివరణ కోరగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా వ్యాపారం జరుగుతుండడంతో భట్టుపల్లి రెవెన్యూ గ్రామంలోని వీరాపురం క్రాస్ రోడ్ లోని సర్వేనెంబర్ 9 లో అక్రమంగా వెలిసిన షాపులకు6,7A నోటీసులు ఇవ్వబోగా సంబంధిత షాప్ నిర్వాహకులు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు వారి Cell phone ఫోటోలు తీశారని తెలిపారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు సంఘటన వివరాలను కలెక్టర్ కు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే అక్రమార్కులను ఎవరిని వదిలి పెట్టేది లేదని, వారిపై PD యాక్ట్ కేసు నమోదు చేస్తామని తహశీల్దార్ తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !