+91 95819 05907

ఆ బెల్టుషాపు ఓనర్ లు తహశీల్దార్ నే ఫోటోలు తీయబోయ్యారా?. ఆ తర్వాత ఎం జరిగింది అంటే?

నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఆయన ఓ మండల మెజిస్ట్రేట్. అన్యాక్రాంతమైన భూమిని కాపాడడానికి తన విధి నిర్వహణలో భాగంగా అక్రమంగా ఉంటున్న భూ యజమానులకు నోటీసు ఇవ్వబోయాడు. సదర్ భూ యజమాని ఓ తహశీల్దార్ నే ఫోటోలు తీసి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తహశీల్దార్ ను భయభ్రాంతులకు గురి చేశాడు. తహశీల్దార్ నాగ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరకగూడెం మండలం భట్టుపల్లి పంచాయతీ వీరాపురం క్రాస్ రోడ్డు వద్ద Survey No:9 ప్రభుత్వ భూమి లో కొంతమంది వ్యక్తులు నివాసం ఏర్పాటు చేసుకుని బెల్ట్ షాపులు ,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఇదే బెల్ట్ షాప్ ల కి గతంలో కరకగూడెం తహసిల్దార్ పాలూరి నాగ ప్రసాద్ రైతు వేషం లో వెళ్లి తనిఖీలు నిర్వహించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కస్తూరిబా పాఠశాల దగ్గరగా ఆ బెల్ట్ షాపు ఉండడమే ఇందుకు కారణమని తహశీల్దార్ అప్పట్లో తెలిపారు. అయినప్పటికిని నేటికి బెల్ట్ షాపు నిర్వాహకులు ఏలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే తహసిల్దార్ నాగప్రసాద్ తన సిబ్బందితో శుక్రవారం మరో మారు ఆ షాపులను తనిఖీ చేయడానికి , అలాగే నోటీసులు జారీ చేయడానికి వెళ్లడం జరిగింది. దీనితో కోపాద్రిక్తులైన ఆ షాపు యజమానులు తహసీల్దార్ ను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఫోటోలు సైతం తీశారని తెలియవచ్చింది. ఓ మండల తహశీల్దార్ పై సంబంధిత షాప్ నిర్వాహకులు ప్రవర్తించిన తీరును మండల ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.

*తహసిల్దార్ నాగప్రసాద్ వివరణ*
కరకగూడెం తాసిల్దార్ నాగప్రసాద్ ని నేటి గద్దర్ న్యూస్ వివరణ కోరగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా వ్యాపారం జరుగుతుండడంతో భట్టుపల్లి రెవెన్యూ గ్రామంలోని వీరాపురం క్రాస్ రోడ్ లోని సర్వేనెంబర్ 9 లో అక్రమంగా వెలిసిన షాపులకు6,7A నోటీసులు ఇవ్వబోగా సంబంధిత షాప్ నిర్వాహకులు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు వారి Cell phone ఫోటోలు తీశారని తెలిపారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు సంఘటన వివరాలను కలెక్టర్ కు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే అక్రమార్కులను ఎవరిని వదిలి పెట్టేది లేదని, వారిపై PD యాక్ట్ కేసు నమోదు చేస్తామని తహశీల్దార్ తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !