+91 95819 05907

ఆ బెల్టుషాపు ఓనర్ లు తహశీల్దార్ నే ఫోటోలు తీయబోయ్యారా?. ఆ తర్వాత ఎం జరిగింది అంటే?

నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఆయన ఓ మండల మెజిస్ట్రేట్. అన్యాక్రాంతమైన భూమిని కాపాడడానికి తన విధి నిర్వహణలో భాగంగా అక్రమంగా ఉంటున్న భూ యజమానులకు నోటీసు ఇవ్వబోయాడు. సదర్ భూ యజమాని ఓ తహశీల్దార్ నే ఫోటోలు తీసి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తహశీల్దార్ ను భయభ్రాంతులకు గురి చేశాడు. తహశీల్దార్ నాగ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరకగూడెం మండలం భట్టుపల్లి పంచాయతీ వీరాపురం క్రాస్ రోడ్డు వద్ద Survey No:9 ప్రభుత్వ భూమి లో కొంతమంది వ్యక్తులు నివాసం ఏర్పాటు చేసుకుని బెల్ట్ షాపులు ,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఇదే బెల్ట్ షాప్ ల కి గతంలో కరకగూడెం తహసిల్దార్ పాలూరి నాగ ప్రసాద్ రైతు వేషం లో వెళ్లి తనిఖీలు నిర్వహించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కస్తూరిబా పాఠశాల దగ్గరగా ఆ బెల్ట్ షాపు ఉండడమే ఇందుకు కారణమని తహశీల్దార్ అప్పట్లో తెలిపారు. అయినప్పటికిని నేటికి బెల్ట్ షాపు నిర్వాహకులు ఏలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే తహసిల్దార్ నాగప్రసాద్ తన సిబ్బందితో శుక్రవారం మరో మారు ఆ షాపులను తనిఖీ చేయడానికి , అలాగే నోటీసులు జారీ చేయడానికి వెళ్లడం జరిగింది. దీనితో కోపాద్రిక్తులైన ఆ షాపు యజమానులు తహసీల్దార్ ను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఫోటోలు సైతం తీశారని తెలియవచ్చింది. ఓ మండల తహశీల్దార్ పై సంబంధిత షాప్ నిర్వాహకులు ప్రవర్తించిన తీరును మండల ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.

*తహసిల్దార్ నాగప్రసాద్ వివరణ*
కరకగూడెం తాసిల్దార్ నాగప్రసాద్ ని నేటి గద్దర్ న్యూస్ వివరణ కోరగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా వ్యాపారం జరుగుతుండడంతో భట్టుపల్లి రెవెన్యూ గ్రామంలోని వీరాపురం క్రాస్ రోడ్ లోని సర్వేనెంబర్ 9 లో అక్రమంగా వెలిసిన షాపులకు6,7A నోటీసులు ఇవ్వబోగా సంబంధిత షాప్ నిర్వాహకులు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు వారి Cell phone ఫోటోలు తీశారని తెలిపారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు సంఘటన వివరాలను కలెక్టర్ కు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే అక్రమార్కులను ఎవరిని వదిలి పెట్టేది లేదని, వారిపై PD యాక్ట్ కేసు నమోదు చేస్తామని తహశీల్దార్ తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !