+91 95819 05907

ఆ బెల్టుషాపు ఓనర్ లు తహశీల్దార్ నే ఫోటోలు తీయబోయ్యారా?. ఆ తర్వాత ఎం జరిగింది అంటే?

నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఆయన ఓ మండల మెజిస్ట్రేట్. అన్యాక్రాంతమైన భూమిని కాపాడడానికి తన విధి నిర్వహణలో భాగంగా అక్రమంగా ఉంటున్న భూ యజమానులకు నోటీసు ఇవ్వబోయాడు. సదర్ భూ యజమాని ఓ తహశీల్దార్ నే ఫోటోలు తీసి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తహశీల్దార్ ను భయభ్రాంతులకు గురి చేశాడు. తహశీల్దార్ నాగ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరకగూడెం మండలం భట్టుపల్లి పంచాయతీ వీరాపురం క్రాస్ రోడ్డు వద్ద Survey No:9 ప్రభుత్వ భూమి లో కొంతమంది వ్యక్తులు నివాసం ఏర్పాటు చేసుకుని బెల్ట్ షాపులు ,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఇదే బెల్ట్ షాప్ ల కి గతంలో కరకగూడెం తహసిల్దార్ పాలూరి నాగ ప్రసాద్ రైతు వేషం లో వెళ్లి తనిఖీలు నిర్వహించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కస్తూరిబా పాఠశాల దగ్గరగా ఆ బెల్ట్ షాపు ఉండడమే ఇందుకు కారణమని తహశీల్దార్ అప్పట్లో తెలిపారు. అయినప్పటికిని నేటికి బెల్ట్ షాపు నిర్వాహకులు ఏలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే తహసిల్దార్ నాగప్రసాద్ తన సిబ్బందితో శుక్రవారం మరో మారు ఆ షాపులను తనిఖీ చేయడానికి , అలాగే నోటీసులు జారీ చేయడానికి వెళ్లడం జరిగింది. దీనితో కోపాద్రిక్తులైన ఆ షాపు యజమానులు తహసీల్దార్ ను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఫోటోలు సైతం తీశారని తెలియవచ్చింది. ఓ మండల తహశీల్దార్ పై సంబంధిత షాప్ నిర్వాహకులు ప్రవర్తించిన తీరును మండల ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.

*తహసిల్దార్ నాగప్రసాద్ వివరణ*
కరకగూడెం తాసిల్దార్ నాగప్రసాద్ ని నేటి గద్దర్ న్యూస్ వివరణ కోరగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా వ్యాపారం జరుగుతుండడంతో భట్టుపల్లి రెవెన్యూ గ్రామంలోని వీరాపురం క్రాస్ రోడ్ లోని సర్వేనెంబర్ 9 లో అక్రమంగా వెలిసిన షాపులకు6,7A నోటీసులు ఇవ్వబోగా సంబంధిత షాప్ నిర్వాహకులు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు వారి Cell phone ఫోటోలు తీశారని తెలిపారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు సంఘటన వివరాలను కలెక్టర్ కు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే అక్రమార్కులను ఎవరిని వదిలి పెట్టేది లేదని, వారిపై PD యాక్ట్ కేసు నమోదు చేస్తామని తహశీల్దార్ తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !