+91 95819 05907

ఏటూరునాగారం టౌన్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మండల కాంగ్రెస్ నాయకులు

నేటి గదర్ న్యూస్,ములుగు:
*కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహించిన మండల కాంగ్రెస్ నాయకులు…*
*దేశావ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ తోనే సాధ్యం…*
*అధికారంలోకి రాగానే దేశావ్యాప్తంగా రైతు రుణమాఫీ కాంగ్రెస్ చేసి తీరుతుంది…*
*ఎస్సి,ఎస్టీ,బీసీ బడుగుబలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ రద్దు చేసే ఆలోచనలో బీజేపీ…*

*రాజ్యాంగం పరిరక్షణ కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చెయ్యాలి…*

*రాష్ట్రంలో, కేంద్రంలో లేని బి.ఆర్.ఎస్ కు ఓటు వేస్తే ప్రయోజనం లేదనేది ప్రజలు గ్రహించాలి….*

తేది :03.05.2024 అనగా ఈ రోజున పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క గారి ఆదేశాలమేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి సూచనలమేరకు మండల అధ్యక్షులు చిటమట రఘు గారి ఆధ్వర్యంలో ఏటూరునాగారం టౌన్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి నియోజకవర్గ కోర్డినేటర్ & బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల ఇంచార్జిలు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు అయూబ్ ఖాన్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య ముఖ్యఅతిధులుగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మండల అధ్యక్షులు చిటమట రఘు గారు మాట్లాడుతూ బీజేపీ పడేండ్ల పాలనలో దేశాన్ని సర్వ నాశనం చేసింది, ప్రభుత్వ ఆస్తులను నరేంద్రమోడీ అమ్మేస్తున్నారని,పేదలకు, యువత కు,రైతులకు పూర్తి వ్యతిరేకంగా పడేండ్లలలో బీజేపీ ప్రభుత్వం నడుచుకుందని, మతాల పేరుతో ప్రజల మధ్యలో గొడవలు సృష్టించారాని అన్నారు.ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ దోస్తులకు కట్టబెట్టి ప్రజలను పీక్కుతిన్నారని అన్నారు.ఎస్సి, ఎస్టీ, బీసీ బడుగుబలహీనవర్గాల రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనలు బిజెపి ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో కేంద్రంలో లేని బి.ఆర్.ఎస్ కు ఓటు వేస్తే ప్రయోజనం లేదనే విషయాన్ని ప్రజల గ్రహించాలని అన్నారు, కాంగ్రెస్ దేశం అంతటా రైతు రుణమాఫీ చేసి తీరుతుందన్నారు, దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని అన్నారు. రాజ్యాంగం పరిరక్షణ కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని అన్నారు.

కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు చేసే అయిదు గ్యారంటీ లు

1.యువ న్యాయం ₹1 లక్ష వేతనం చదువుకున్న యువతకు ఖచ్చితమైన మొదటి ఉద్యోగం…

2.రైతు న్యాయం రుణ మాఫీ మరియు స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ఆధారంగా కనీస మద్దతు ధర (MSP) కి చట్టపరమైన హోదా…

3.సామాజిక న్యాయం జన గణన ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కోసం కుల గణన…

4.నారీ న్యాయం ₹1 లక్ష ప్రతి సంవత్సరం ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు…

5.శ్రామిక న్యాయం 400 ప్రతి రోజు | జాతీయ ఉపాధి హామీ కూలీలతో సహా దేశవ్యాప్తంగా కార్మికులందరికీ జాతీయ రోజువారి కనీస వేతనం కల్పిస్తుంది.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, మండల అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకురాలు, మాజీ ప్రజాప్రతినిధులు, సహకార సంఘం నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పేకాటరాయుళ్ల అరెస్ట్ ●రూ.20 వేల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం★వారి లో ఓ కానిస్టేబుల్ కూడా!!!

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పాములపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ క్రింద పేకాట ఆడుతున్న 10మంది పేకాటరాయులను అశ్వాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు

Read More »

కార్బైడ్ తో పండించిన మామిడి పండ్ల‌ను ఇలా గుర్తించండి..

నేటి గదర్ వెబ్ డెస్క్: వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మామిడి పండ్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గానే ఉంటుంది. అనేక ర‌కాల జాతుల‌కు చెందిన మామిడి పండ్లు మన‌కు ఈ సీజ‌న్‌లో క‌నిపిస్తూ నోరూరించేలా చేస్తుంటాయి. అయితే

Read More »

జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

★రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌ జూన్ 2వ తేదీ నుంచి భూభార‌తి చ‌ట్టంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హణ 💠గ‌త ప‌ది సంవ‌త్స‌రాల‌లో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌న్న ఆశ‌యంతో

Read More »

నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి:నిమ్మల

*సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న* నేటి గదర్ కరకగూడెం : మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రదర్శన ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్

Read More »

ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డి ఏ ఓ పుల్లయ్య.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా,కొణిజర్ల మండలం, తనికెళ్ళ రైతు వేదిక నందు DAO పుల్లయ్య గారు రైతు రిజిస్ట్రీ ని తనిఖీ చేయటం జరిగింది,జనవరి

Read More »

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌తో భేటీ అయిన రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి.

* గ‌వ‌ర్న‌ర్ ద‌త్త‌త తీసుకున్న గ్రామాల్లో కూడా ఇందిర‌మ్మ ఇళ్లు * భూభార‌తి అమ‌లుపై వివరణ. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. హైద‌రాబాద్: రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శ్రీ

Read More »

 Don't Miss this News !