+91 95819 05907

ఇండ్ల మధ్యలోనే గ్యాస్ గోడౌన్లు కానరాని ఫైర్ సేఫ్టీ నిబంధనలు…

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా గ్యాస్ కంపెనీలు…

నిబంధనలను పాతరేస్తున్నా యాజమాన్యాలు…

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం మే 7:
నైనారపు నాగేశ్వరరావు✍️
7893538668

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లోని కొత్తగూడెం,ఇల్లందు, పాల్వంచ,అశ్వరావుపేట,భద్రాచలం, దుమ్ముగూడెం,చర్ల,సారపాక,అశ్వాపురం, మణుగూరు ప్రధాన పట్టణాల్లో ప్రజలు అత్యధికంగా నివసించే జనవాసాల మధ్య వివిధ గ్యాస్ కంపెనీలు గ్యాస్ గోడౌన్లు ఏర్పాటు చేయడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురై బెంబేలెత్తుతున్నారు.వేసవి కాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో గ్యాస్ గోడౌన్లు ఇండ్ల మధ్యలో ఉండటం వలన ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.పేలుడు పదార్థాలకు సంబంధించిన గ్యాస్ గోడౌన్లను ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో అంటే ఊరి చివర్లో ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.కానీ,పలు గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు మాత్రం భద్రతా నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.జనావాసాలలో ఇష్టారాజ్యంగా గోడౌన్లను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు మేధావులు ముక్త కంఠంతో మండిపడుతున్నారు.ప్రధానమైన ఏజెన్సీల నుండి సబ్ ఏజెన్సీలు తీసుకొని ఎక్కడపడితే అక్కడ ప్రధాన రహదారులపై గ్యాస్ సిలిండర్లు పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తూ,నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.తదితర ప్రాంతాలలో ఏర్పాటైన గోడౌన్లే ఇందుకు నిదర్శనం.గ్యాస్ కంపెనీల పంపిణీదారులు గోడౌన్లను ఏర్పాటు చేసే ముందు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.కానీ ఇక్కడ మాత్రం గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు తమ పలుకుబడిని ఉపయోగించి నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని పలు ఆరోపణలు వెళ్ళు వెత్తుతున్నాయి.పెట్రోలియం ఎక్స్ ప్లోజిల్ సేప్టి ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఓసీ తోపాటు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి.ఏదైనా ప్రమాదం సంభవిస్తే తమ పరిస్థితి ఏమిటని గోడౌన్ చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ వేడిమికి గ్యాస్ గోడౌన్ లో ఎలాంటి ప్రమాదాలు జరిగిన దానికి పూర్తి బాధ్యత సంబంధిత అధికారులే వహించాలని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని జనావాసాల మధ్య నుంచి గోడౌన్లను తొలగించి పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు ప్రజాతంత్ర వాదులు కోరుతున్నారు.

.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై..ఆశీర్వదించిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు.మడుపల్లి భాస్కర్.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, ఈరోజు ఖమ్మం పట్టణంలోని R R R. ఫంక్షన్ హాల్ నందు …చింతకాని చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ *దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మేనకోడలు వేమూరి

Read More »

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ, నిరసన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన

Read More »

చలో వరంగల్, సైకిల్ పై ప్రచార యాత్ర నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: ఈనెల 27 న వరంగల్ లో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ, ను జయప్రదం చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించిన భద్రాద్రి

Read More »

ఈనెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది

. గజ్వేల్ మండల్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి చిట్యాల ఎల్లం. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 24. వరంగల్ లో ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే రజోత్సవ

Read More »

 Don't Miss this News !