+91 95819 05907

ఇండ్ల మధ్యలోనే గ్యాస్ గోడౌన్లు కానరాని ఫైర్ సేఫ్టీ నిబంధనలు…

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా గ్యాస్ కంపెనీలు…

నిబంధనలను పాతరేస్తున్నా యాజమాన్యాలు…

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం మే 7:
నైనారపు నాగేశ్వరరావు✍️
7893538668

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లోని కొత్తగూడెం,ఇల్లందు, పాల్వంచ,అశ్వరావుపేట,భద్రాచలం, దుమ్ముగూడెం,చర్ల,సారపాక,అశ్వాపురం, మణుగూరు ప్రధాన పట్టణాల్లో ప్రజలు అత్యధికంగా నివసించే జనవాసాల మధ్య వివిధ గ్యాస్ కంపెనీలు గ్యాస్ గోడౌన్లు ఏర్పాటు చేయడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురై బెంబేలెత్తుతున్నారు.వేసవి కాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో గ్యాస్ గోడౌన్లు ఇండ్ల మధ్యలో ఉండటం వలన ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.పేలుడు పదార్థాలకు సంబంధించిన గ్యాస్ గోడౌన్లను ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో అంటే ఊరి చివర్లో ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.కానీ,పలు గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు మాత్రం భద్రతా నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.జనావాసాలలో ఇష్టారాజ్యంగా గోడౌన్లను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు మేధావులు ముక్త కంఠంతో మండిపడుతున్నారు.ప్రధానమైన ఏజెన్సీల నుండి సబ్ ఏజెన్సీలు తీసుకొని ఎక్కడపడితే అక్కడ ప్రధాన రహదారులపై గ్యాస్ సిలిండర్లు పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తూ,నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.తదితర ప్రాంతాలలో ఏర్పాటైన గోడౌన్లే ఇందుకు నిదర్శనం.గ్యాస్ కంపెనీల పంపిణీదారులు గోడౌన్లను ఏర్పాటు చేసే ముందు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.కానీ ఇక్కడ మాత్రం గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు తమ పలుకుబడిని ఉపయోగించి నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని పలు ఆరోపణలు వెళ్ళు వెత్తుతున్నాయి.పెట్రోలియం ఎక్స్ ప్లోజిల్ సేప్టి ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఓసీ తోపాటు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి.ఏదైనా ప్రమాదం సంభవిస్తే తమ పరిస్థితి ఏమిటని గోడౌన్ చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ వేడిమికి గ్యాస్ గోడౌన్ లో ఎలాంటి ప్రమాదాలు జరిగిన దానికి పూర్తి బాధ్యత సంబంధిత అధికారులే వహించాలని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని జనావాసాల మధ్య నుంచి గోడౌన్లను తొలగించి పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు ప్రజాతంత్ర వాదులు కోరుతున్నారు.

.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !