+91 95819 05907

మూడో విడతలోనే NDA విజయం వైపు : ప్రధాని మోదీ

నేటి గద్ధర్ వెబ్ డెస్క్:

మూడో విడతలోనే ఎన్డీఏ విజయం వైపు పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్​ ఎక్కడ గెలుస్తుందో బూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారని ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు హనుమకొండ నుంచే గెలిచారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలను తమ పార్టీని ఎన్నటికీ మరవలేదని వ్యాఖ్యానించారు. వరంగల్​ ప్రజలు ఎప్పుడూ బీజేపీకి మద్దతుగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు వరంగల్​లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ* పాల్గొన్నారు. వరంగల్​ లోక్​సభ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్​కు మద్దతుగా ప్రచారం చేశారు. ఆరూరి రమేశ్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని మోదీ కోరారు. వికసిత్​ భారత్​ కావాలని, భారతదేశ​ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. *ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అశాంతి, విపత్తులు నెలకొన్నాయని,* *భారత్​ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదం పొంచి ఉంటుందని* ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మరోసారి బీజేపీకి ప్రజలు పట్టం కట్టాలని ప్రధాని మోదీ కోరారు. *కాంగ్రెస్​ ప్రభుత్వ పాలనలో పాపాలను ప్రజలు చూశారు.* *కాంగ్రెస్​ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి.* కాంగ్రెస్​ హయాంలో బాంబు పేలుళ్లు వంటి ఘటనలు చూశాం. *ఇండియా కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను తీసుకువస్తామని చెబుతోంది.* ప్రతి పార్టీకి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా? *రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్​ మోసగించింది. ఇప్పుడేమో ఆగస్టు 15 లోగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెబుతోంది.* *లోక్​సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ చేతులెత్తేయాలని చూస్తోంది.* అమరవీరులకు పింఛన్ల హామీని కాంగ్రెస్​ నెరవేర్చిందా? *మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ నెరవేర్చిందా?* విద్యుత్​ కోతలతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. విశ్వాస ఘాతుకానికి పాల్పడిన కాంగ్రెస్​ ప్రజలకు మేలు చేస్తుందానని’ ప్రధాని మోదీ ప్రశ్నించారు.

*కాంగ్రెస్​ వచ్చాక ఖజానా ఖాళీ :* కాంగ్రెస్​ వచ్చాక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రజల డబ్బులు ఎక్కడికి వెళ్తోందని ప్రశ్నించారు. *ఆర్​ఆర్​ ట్సాక్స్​ పేరిట ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతోందని* ఆరోపించారు. కాంగ్రెస్​ పాలనలో రాజ్యాంగానికి ఎలాంటి రక్షణ లేదని అన్నారు. *మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా ఉందన్న మోదీ,* కర్ణాటకలో బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇచ్చారని మండిపడ్డారు. *ఎస్సీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్​ వెనకడుగు వేసిందని, ఎస్సీలకు రిజర్వేషన్ల విషయంలో తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని* మోదీ హామీ ఇచ్చారు. *తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశామని* వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్​ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
*బీజేపీ వచ్చాక ఎస్సీ వ్యక్తి రామ్​నాథ్​ కోవింద్​ను రాష్ట్రపతిగా చేశాం.* *రెండోసారి వచ్చాక ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశాం.* *ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును కాంగ్రెస్​ వ్యతిరేకించింది.* చాలా మంది ప్రజల శరీర రంగు నలుపు ఉంటుంది. *శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలి.* ద్రౌపది ముర్మును ఓడించాలని కాంగ్రెస్​ యత్నించింది. దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని కాంగ్రెస్​ చూస్తోంది. శరీర రంగు ఆధారంగా యోగ్యత నిర్ణయిస్తారా?. *శరీర రంగు ఆధారంగా దేశ ప్రజలను అవమానించాలని అనుకుంటున్నారా?* . శరీర రంగు ఆధారంగా అవమానించాలని చూస్తే నేను ఎన్నటికీ సహించను.” అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !