+91 95819 05907

మహబూబాబాద్‌ గడ్డపై ఎగిరేది గులాబి జెండానే.

◆మాలోత్ కవితను గెలిపించండి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వట్టం.రాంబాబు
నేటి గద్దర్ కరకగూడెం: మండల పరిధిలోని కన్నాయిగూడెం,కల్వలనగారం,వెంకటాపురం గ్రామాలలో,పినపాక మాజీ శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ  పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితని గెలిపించాలని కోరుతూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రావుల సోమయ్య, ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గం ఇంచార్జి వట్టం రాంబాబు మాట్లాడుతూ.బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే బ్రష్టు పట్టించిందని. తెలంగాణ హక్కులను కాపాడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని అన్నారు.పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితని భారీ మెజార్టీతో గెలిపించాలని హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడంతో ప్రజలు బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని అయన అన్నారు.రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి మాజీ సీఎం కేసీఆర్ ధ్వర్యంలో జరిగింది అన్నారు ప్రజలు మరోసారి మోసపోకుండా బిఆర్ఎస్ కు మద్దతు పలకలన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు.గతంలో 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలనలో ప్రజలకు సమృద్ధిగా సంక్షేమ ఫలాలు అందించడం జరిగిందిని సాగునీరు కరెంటు వంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు, మనకోసం మన రాష్ట్రం కోసం నిరంతరం పోరాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు, ఆరు గ్యారెంటీల అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు ఏడ్ల శ్రీనివాస్ పినపాక నియోజకవర్గం రేగా సోషల్ మీడియా సభ్యులు గిద్దె సాయికిరణ్, శేఖర్,కల్తీ నరేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !