+91 95819 05907

పురుగుల అన్నం..చాలి చాలని కూరలు.. నీళ్ల పెరుగు?!

★ఈ బువ్వ తినేదెట్లా…. చదివేదేలా?!
★మీ పిల్లల కు ఒక్క పూట ఈ బువ్వ పెడతారా?మేడం
★ అర్ధాకలి తో హాస్టల్ విద్యార్థులు
★ సెమిస్టర్ పరీక్షల పైన ప్రభావం
★ సమస్యలను విన్నవిస్తే టీసీ ఇస్తామని బెదిరింపులు?
★ ITDA అధికారులకు పట్టింపు లేదా?
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
★ ఆ హాస్టల్ విషయం నా దృష్టికి రాలేదు, విచారణ చేస్తాం: ఐటీడీఏ డిడి మణెమ్మ
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: పురుగుల అన్నం …. చాలీచాలని కూరలు…. విరసి అర్ధాకలితో పస్తులు ఉంటున్న విద్యార్థులు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ హాస్టల్లో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. మా హాస్టల్ దుస్థితిపై నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక కథనం. విద్యార్థుల కథనం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్ట గూడెంలో టి టి డబ్ల్యూ ఆర్ డి సి మణుగూరు గురుకుల డిగ్రీ కాలేజ్ కలదు. సుమారు 300 వరకు విద్యార్థులు గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా విద్యార్థులకు వడ్డించే భోజనంలో పురుగులు రావడం జరుగుతుంది. అన్నం సైతం ముద్దుల ముద్దలుగా ఉంటుంది. ఒకవైపు సెమిస్టర్ పరీక్షలు… మరోవైపు అర్ధాకరి బతుకులు దీనితో విద్యార్థుల పరీక్షలపై ప్రభావం పడుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోటే హాస్టల్లో ఈ దుర్భర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు ఆవేదన వెలుబుచున్నారు. ఐటీడీఏ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి హాస్టల్ పై పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇలా ఉండగా విద్యార్థులు భోజనంలో పురుగులు వస్తున్న విషయాన్ని ఆ గురుకులం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లాగా TC ఇస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ITDA DD వివరణ: ఇదే విషయమై ఐ టి డి ఏ డి డి మన్నెమ్మను నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా ఆ హాస్టల్లో నెలకొన్న సమస్యలు తన దృష్టికి రాలేదని, ఆ గురుకులాన్ని విజిట్ చేసి సమస్యలు పరిష్కరిస్తానని వివరణ ఇవ్వడం జరిగింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !