+91 95819 05907

పురుగుల అన్నం..చాలి చాలని కూరలు.. నీళ్ల పెరుగు?!

★ఈ బువ్వ తినేదెట్లా…. చదివేదేలా?!
★మీ పిల్లల కు ఒక్క పూట ఈ బువ్వ పెడతారా?మేడం
★ అర్ధాకలి తో హాస్టల్ విద్యార్థులు
★ సెమిస్టర్ పరీక్షల పైన ప్రభావం
★ సమస్యలను విన్నవిస్తే టీసీ ఇస్తామని బెదిరింపులు?
★ ITDA అధికారులకు పట్టింపు లేదా?
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
★ ఆ హాస్టల్ విషయం నా దృష్టికి రాలేదు, విచారణ చేస్తాం: ఐటీడీఏ డిడి మణెమ్మ
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: పురుగుల అన్నం …. చాలీచాలని కూరలు…. విరసి అర్ధాకలితో పస్తులు ఉంటున్న విద్యార్థులు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ హాస్టల్లో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. మా హాస్టల్ దుస్థితిపై నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక కథనం. విద్యార్థుల కథనం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్ట గూడెంలో టి టి డబ్ల్యూ ఆర్ డి సి మణుగూరు గురుకుల డిగ్రీ కాలేజ్ కలదు. సుమారు 300 వరకు విద్యార్థులు గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా విద్యార్థులకు వడ్డించే భోజనంలో పురుగులు రావడం జరుగుతుంది. అన్నం సైతం ముద్దుల ముద్దలుగా ఉంటుంది. ఒకవైపు సెమిస్టర్ పరీక్షలు… మరోవైపు అర్ధాకరి బతుకులు దీనితో విద్యార్థుల పరీక్షలపై ప్రభావం పడుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోటే హాస్టల్లో ఈ దుర్భర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు ఆవేదన వెలుబుచున్నారు. ఐటీడీఏ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి హాస్టల్ పై పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇలా ఉండగా విద్యార్థులు భోజనంలో పురుగులు వస్తున్న విషయాన్ని ఆ గురుకులం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లాగా TC ఇస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ITDA DD వివరణ: ఇదే విషయమై ఐ టి డి ఏ డి డి మన్నెమ్మను నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా ఆ హాస్టల్లో నెలకొన్న సమస్యలు తన దృష్టికి రాలేదని, ఆ గురుకులాన్ని విజిట్ చేసి సమస్యలు పరిష్కరిస్తానని వివరణ ఇవ్వడం జరిగింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !