+91 95819 05907

ఆరోజు వరకు సెక్షన్ 144 అమల్లో ఉంటుంది

– ప్రజలు ఓటర్లు అధికారులకు సహకరించాలి

– ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవు

– జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్

నేటి గద్దర్, మే 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఈరోజు సాయంత్రం 4:00 గంటల నుండి 14.05.2024 సాయంత్రం 6:00 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున ఎవరూ కూడా పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమిగూరాదని తెలిపారు. పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవ్వరు లోపలికి రాకూడదని సూచించారు. జిల్లాలో ప్రజలు ఇట్టి విషయం పైన దృష్టి సారించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎవరైనా ఈ నియమ నిబంధనలను పాటించకుండా ఇబ్బందులకు గురిచేస్తే అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోబాలకు గురి చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సీ-విజిల్ యాప్ ద్వారా గానీ, డయల్ 100కి ఫోన్ చేసి గానీ దగ్గరలోని పోలీసు అధికారులకు గానీ సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మన జిల్లాలో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉంటుందని,ప్రజలంతా ఇట్టి విషయాన్ని గమనించి తమ ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

Surya peta: వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు.

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు. వరంగల్ లో జరుగనున్న BRS రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్న సూర్యాపేట రైతులు.. BRS రజతోత్సవ సభకు మేముసైతం

Read More »

పినపాకలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు .

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా జరిగాయి. పినపాక మండల తెలుగు దేశం పార్టీ

Read More »

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు. మహదేవపురం ఎత్తిపోతల పథకం – సాగునీటి సరఫరాలో చరిత్రాత్మక ముందడుగు ఖమ్మం జిల్లా,మధిర మండలం,

Read More »

మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.

. బునియది ఆదివాసి, కార్యకర్తల సమ్మేళన్ శిక్షణ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..

Read More »

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసిన తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం

Read More »

 Don't Miss this News !